Xiaomi 17: చైనా కంపెనీ Xiaomi ఇప్పటికే 17 సిరీస్ లో పలు మోడళ్లు మార్కెట్లో ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి Xiaomi 17, Xiaomi 17 Ultra అనే మొబైల్స్ 2025 డిసెంబర్లో ఆవిష్కరించారు. త్వరలోనే త్వరలోనే ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. అలాగే వీటి సమాచారం ఇప్పటికే ఆన్లైన్లో ఉండడంతో ఈ మొబైల్ ఫీచర్స్ తెలిసి వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు. డిజైన్ తో పాటు కొన్ని రకాల ప్రత్యేక ఫీచర్స్ కన్వీనెంట్గా ఉంటాయని అంటున్నారు. ధర విషయంలో కూడా చర్చ సాగుతోంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Xiaomi 17, Xiaomi 17 Ultra అనే మొబైల్ ఫిబ్రవరి 28 న మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మొబైల్స్ లో దాదాపుగా ఒకే ఫీచర్స్ ఉండనున్నాయి. అయితే కొన్ని భిన్నంగానే ఉంటాయి.Xiaomi 17 మూడు రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ రెండిట్లోనూ ఒకే ఫీచర్స్ ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hyper OS 3 తో పనిచేస్తూ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్ సెట్ ద్వారా పవర్ అందుతుంది. దీంతో గేమింగ్ కోరుకునే వారితోపాటు.. వీడియోలు చూస్తూ.. పలు రకాల యాప్స్ ఒకేసారి ఓపెన్ చేసినా కూడా ఎలాంటి బేగం తగ్గకుండా ఉంటుంది.
ఈ మొబైల్స్ లో బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండాలనుంది. వీటిలో 6330 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 100 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. రోజంతా వినియోగించినా కూడా బ్యాటరీ చార్జింగ్ తగ్గకుండా ఉంటుంది. అలాగే బిజీగా ఉన్న సమయంలో కూడా తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఇది సపోర్ట్ గా ఉంటుంది. ఈ రెండింటి మొబైల్స్ లో Xiaomi 17 కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు. దీని బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉండగానే ఉంది. ఇది ఏఐ ఫోటోలను కావాలంటే కూడా అందిస్తుంది. ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది.50 MP అల్ట్రా వైడ్ కెమెరాతో నాణ్యమైన ఫోటోలను అందిస్తుంది. సెల్ఫీలతో పాటు, వీడియో కాలింగ్ కోసం 50 ఎంపీ కెమెరా పనిచేస్తుంది. ఇందులో ఉండే డిస్ప్లే కూడా ఇంప్రెస్ చేస్తుంది. 6.3 అంగుళాల OLED డిస్ప్లే ఉండడంతో పాటు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.
అయితే మార్కెట్లోకి వస్తే ఈ మొబైల్స్ ధర ఎలా ఉంటుంది? అన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. వీటిలో Xiaomi 17 మొబైల్ ధర రూ.1,18,000 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే Xiaomi 17 Ultra ను రూ. 1,61,000 తో విక్రయించనున్నారు.