Reliance Power Shares: 1525 కోట్ల షేర్ల జారీకి రిలయన్స్ బోర్డు గ్రీన్ సిగ్నల్..

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ రూ. 1,524.60 కోట్ల విలువైన 46.2 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రతీ షేరుకు రూ. 33 ధరతో ప్రిఫరెన్షియల్ ఇష్యూపై దృష్టి సారించాయి.

Written By: Mahi, Updated On : September 25, 2024 2:10 pm

Reliance Power Shares

Follow us on

Reliance Power Shares: రిలయన్స్ పవర్ లిమిటెడ్ రూ. 1,524.60 కోట్ల విలువైన 46.2 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రతీ షేరుకు రూ. 33 ధరతో ప్రిఫరెన్షియల్ ఇష్యూపై మంగళవారం దృష్టి సారించాయి. సోమవారం ముగింపు ధరతో పోలిస్తే 14 శాతం తగ్గింపుతో ఉంది. ప్రమోటర్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, నాన్ ప్రమోటర్ సంస్థలు ఔథమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, సనాతన్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (సంజయ్ కొఠారి, మీనాక్షి సంజయ్ కొఠారి.) లకు ఈ ఇష్యూ చేయాలని ప్రతిపాదించారు. దీంతో 18,31,00,000 ఈక్విటీ షేర్ల కేటాయింపు తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 24.88 శాతం, ప్రమోటర్ గ్రూపునకు 24.95 శాతం వాటా ఉంటుంది. జూన్ 30వ తేదీకి రిలయన్స్ పవర్ లో 93,01,04,490 షేర్లు (23.15 శాతం) ఉన్నాయి. 21,82,00,000 ఈక్విటీ షేర్ల కేటాయింపు తర్వాత ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో 6.59 శాతం వాటా కలిగి ఉంటుంది. జూన్ 30, 2024 నాటికి రిలయన్స్ పవర్ లో ఈ కంపెనీకి సంబంధించి 7,67,77,000 షేర్ల (1.91 శాతం) వాటా ఉంది. కేటాయింపు తర్వాత రిలయన్స్ పవర్ లో సనాతన్ ఫైనాన్షియల్ అడ్వెయిజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 1.36 శాతం వాటా ఉంటుంది. సోమవారం బీఎస్ఈలో రిలయన్స్ పవర్ షేరు 4.98 శాతం లాభంతో రూ. 38.16 వద్ద ముగిసింది.

స్టాండలోన్ ప్రాతిపదికన ఇది జీరో బ్యాంక్ రుణమని, వృద్ధిలో కొత్త పుంతలు తొక్కేందుకు సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ పవర్ తెలిపింది. ముఖ్యంగా రిలయన్స్ పవర్ నేరుగా, తన స్పెషల్ పర్పస్ వెహికల్స్, సబ్సిడరీల ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో తన ఉనికిని విస్తరించాలని భావిస్తోంది. దీర్ఘకాలిక వనరులను పెంచుకునేందుకు, నెట్ వర్త్, ఆర్థిక స్థితిని పెంచుకునేందుకు ఇప్పటికే ఉన్న రుణాన్ని తగ్గించుకునేందుకు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చేందుకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలతో సహా దీర్ఘకాలిక వయబిలిటీ, వృద్ధి, విస్తరణను నిర్ధారించడానికి, వాటాదారుల విలువను పెంచేలా కంపెనీకి కొత్త మూలధనాన్ని జారీ చేయాలని ప్రతిపాదించింది.

రిలయన్స్ పవర్ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని, రూ. 803.60 కోట్లను పునరుత్పాదక ఇంధన రంగంలో తన ఉనికిని విస్తరించేందుకు, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడంతో సహా ఇతర కొత్త వ్యాపార అవకాశాల కోసం ఉపయోగించాలని భావిస్తోంది. ఇందుకు కంపెనీ తన అనుబంధ సంస్థలు.. స్పెషల్ పర్పస్ వెహికల్స్.. జాయింట్ వెంచర్లలో ఈక్విటీ, క్వాసీ ఈక్విటీ, సబార్డినేటెడ్ లేదా అన్ సబ్ ఆర్డినేటెడ్ డెట్ (సెక్యూర్డ్ లేదా అన్ సెక్యూర్డ్) రూపంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థిక సాయం అందిస్తుంది.

ఇష్యూ ఆదాయంలో కొంత భాగాన్ని (అంటే రూ. 340 కోట్లు) రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి కంపెనీ పొందిన ప్రస్తుత రుణాన్ని మార్చేందుకు దీని ద్వారా రిలయన్స్ పవర్ ప్రస్తుత రుణాన్ని తగ్గించేందుకు మళ్లించబడుతుంది. ఇది రిలయన్స్ పవర్ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం, నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడం అంతిమంగా భవిష్యత్తులో స్థిరమైన వృద్ధికి స్థానం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇష్యూ ఆదాయంలో 25 శాతం వరకు నిర్వహణ ఖర్చులు, కార్పొరేట్ అవసరాలు, ఆకస్మిక పరిస్థితుల నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని తెలిపింది. కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, నికర విలువను పెంచడం, రుణాన్ని తగ్గించడం, దీర్ఘకాలిక వృద్ధి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ నిధులను మళ్లించవచ్చని రిలయన్స్ పవర్ తెలిపింది.