Electric car without petrol diesel: అప్పట్లో రాజేంద్రప్రసాద్ హీరోగా బామ్మ మాట బంగారు బాట అనే సినిమా వచ్చింది గుర్తుందా..అందులో ఓ కారులో వచ్చే సన్నివేశాలు నవ్వుతెప్పిస్తాయి. నూతన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ ప్రయాణించే కారు ఆకస్మాత్తుగా సూపర్ కారుగా మారిపోతుంది. ఎటువంటి చమురు అవసరం లేకుండానే ఈ కారు ముందకు సాగుతుంది. అప్పట్లో ఈ సినిమా పెను సంచలనం కలిగించింది.
ఇప్పటికాలంలో ఆ తరహాలోనే కార్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. కాకపోతే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. ఇప్పటికాలంలో పెట్రోల్, డీజిల్ లేకుండా, ఈవీ తో సంబంధం లేకుండా కార్లను రూపొందిస్తున్నాయి కంపెనీలు. ఈ జాబితాలో మారుతీ సుజుకీ సింహభాగంలో నిలుస్తోంది. ఈకంపెనీ తయారు చేసిన కారు పూర్తిగా ఇథనాల్ తో నడుస్తుంది. అంతే కాదు, రోడ్ల మీద నుంచి రయ్యిమంటూ దూసుకుపోతుంది.
జూన్ ఐదున పర్యావరణ దినోత్సవం సందర్భంగా మారుతీ సుజుకీ ఈ కారును విడుదల చేయబోతోంది. ఇది పూర్తిగా ఇథనాల్(e100)తో నడుస్తుంది. మనదేశంలో ఇదే తొలి ఇథనాల్ ప్లెక్స్ ప్యూయల్ కారు కావడం గమనార్హం. మనదేశంలో ఇప్పటికే 20శాతం ఇథనాల్ మిళితమైన పెట్రోల్ అమ్ముతున్నారు. ప్రభుత్వం కూడా ఇథనాల్ పర్సంటేజ్ ను 30 కి పెంచే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో మారుతీ పూర్తిగా ఇథనాల్ తో నడిచే కారును ఆవిష్కరించడం గమనార్హం. పూర్తి ఇథనాల్ వల్ల ఇంధనం ఖర్చు 25 నుంచి 35 శాతం తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఇంధనం మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా కారు కోసం పెట్టే నిర్వహణ ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది.
అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంధనం మీద ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఆయిల్ తయారీ దేశాలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇంధనం ధరలలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ధరల స్థాయి నిరంతరం ఒత్తిడికి గురవుతోంది. అందువల్లే ఇథనాల్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇథనాల్ వల్ల తక్కువ ఖర్చుతో వాహనాలను నడపవచ్చు. అంతేకాదు, వాహనాల పనితీరు కూడా బాగుంటుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది.
