spot_img
Homeబిజినెస్New Ookla CEO : సీఈవో అంటే నువ్వు స్వామి.. నీలాంటోడు కంపెనీకి ఒకడుండాలి

New Ookla CEO : సీఈవో అంటే నువ్వు స్వామి.. నీలాంటోడు కంపెనీకి ఒకడుండాలి

New Ookla CEO : కార్పొరేట్ కంపెనీలు వేలకోట్ల టర్నోవర్ సాగిస్తుంటాయి కాబట్టి.. వ్యాపార విస్తరణను పెంచుకుంటాయి కాబట్టి.. అన్ని విభాగాలలో సత్తా చాటే సీఈఓలను నియమించుకుంటాయి. పేరుపొందిన విశ్వవిద్యాలయాలలో చదివిన వారికి కార్పొరేట్ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్లో గొప్ప గొప్ప కాలేజీల్లో చదువుకున్న వారికి ఊహించనంత స్థాయిలో వేతనాలు ఇచ్చి నియమించుకుంటాయి. కంపెనీలు ఆ స్థాయిలో వేతనాలు ఇస్తాయి కాబట్టే.. సేవలు కంపెనీలకు నమ్మిన బంటు లాగా ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో ఓ కంపెనీ సీఈవో తన పనితీరును సరికొత్తగా నిరూపించుకున్నారు. తన కంపెనీలో ఓ వృద్ధుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణమైన ఉద్యోగులపై అత్యంత కఠినంగా వ్యవహరించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చినట్టుగా.. పనిష్మెంట్ ఇచ్చారు. ఏకంగా 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని సూచించారు..

ఇంతకీ ఏం జరిగిందంటే

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో న్యూ ఓక్లా పేరుతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనే పేరుతో ఓ సంస్థ ఉంది. ఇందులో 16 మంది విధులు నిర్వహిస్తున్నారు.. ఈ సంస్థలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి నోయిడా ప్రజలు వస్తుంటారు. ఈ అథారిటీకి సరిగ్గా గత ఏడాది క్రితం ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేష్ సీఈవోగా నియమితులయ్యారు.. విధి నిర్వహణలో ఎంతో నిక్కచ్చిగా ఉండే ఈయన.. ఏమాత్రం అసౌకర్యం కలిగినా సహించరు.. వృద్ధుల విషయంలో ఆయన ఎంతో ఉదారత చూపిస్తుంటారు. వృద్ధులను ఎక్కువసేపు నిలబడితే ఊరుకోరు. వృద్ధులకు అందిస్తున్న సేవలను.. ఒకవేళ సేవలను లోపాలు తలెత్తితే పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు చూస్తుంటారు. డిసెంబర్ 16, సోమవారం నాడు ఓక్లా కార్యాలయానికి ఓ వృద్ధుడు వచ్చాడు. తన పని నిమిత్తం కౌంటర్ వద్ద నిలబడ్డాడు.. ఆ విషయాన్ని లోకేష్ సీసీ కెమెరాలు చూశాడు. ఆయనకు కావలసిన పనిని చేసిపెట్టాలని లోకేష్ ఓ మహిళా ఉద్యోగికి సూచించారు. ఆ పని సాధ్యం కాకపోతే.. వెంటనే ఆ వృద్ధుడికి చెప్పాలని సూచించారు. లోకేష్ ఇలా చెప్పి 20 నిమిషాలు గడిచినప్పటికీ.. ఆ వృద్ధుడు కౌంటర్ వద్ద నిలబడ్డాడు. దీంతో ఆ సీఈవో ఆ విషయాన్ని మొత్తం గమనించారు. వెంటనే కార్యాలయం వద్దకి వేగంగా వచ్చారు. వెంటనే అటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని సూచించారు. వారు నిలబడి పనిచేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ కార్యాలయాలలో వెంటనే ఉద్యోగులు స్పందించాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version