Homeబిజినెస్Monday IPO: సోమవారం ఐపీవోకు రానున్న బడా సంస్థ.. ప్రతీ షేరు ఎంతంటే?

Monday IPO: సోమవారం ఐపీవోకు రానున్న బడా సంస్థ.. ప్రతీ షేరు ఎంతంటే?

Monday IPO: ప్రతిరోజూ ఏదో ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఐపీఓలను తీసుకువస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 21న సబ్ స్క్రిప్షన్ కు తెరతీస్తున్న ఐపీఓను తీసుకువచ్చేందుకు మరో కంపెనీ సిద్ధమైంది. దీని ధర బ్యాండ్, గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) మీ మనసును కదిలిస్తుంది. అన్ లిస్టెడ్ మార్కెట్లో ఈ ఐపీఓ ద్వారా ఒక్కో షేరు ధర రూ. 2813 వద్ద స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. అది మరే కంపెనో కాదు ‘వారీ ఎనర్జీస్’. వారీ ఎనర్జీస్ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగుస్తుంది. అదే సమయంలో, దాని షేర్లను అక్టోబర్ 24న కేటాయిస్తారు. 28న దాని షేర్లు మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. ఇవి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జాబితా ఉంటాయి. ఈ ఐపీవో మొత్తం పరిమాణం రూ. 4,321.44 కోట్లు.

ప్రైస్ బ్యాండ్ ఎంత?
ఐపీఓ ద్వారా రూ. 3,600 విలువైన 2.4 కోట్ల షేర్లను విక్రయించనుంది. అదే సమయంలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ. 721.44 కోట్ల విలువైన 48 లక్షల షేర్లను జారీ చేయనుంది. కంపెనీ ప్రైస్ బ్యాండ్ విషయానికొస్తే వారీ ఎనర్జీస్ ఐపీఓ ద్వారా ఒక్కో షేరు ధర రూ. 1427 నుంచి రూ. 1503 వరకు ఉంది. ఇది ఒక మెయిన్ బోర్డ్ కంపెనీ ఐపీవో. దీని కింద కనీసం రిటైల్ ఇన్వెస్టర్లు 9 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్ కొనాలంటే రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 13,527 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఈ ఐపీఓ కింద 15 లాట్లు, 74 లాట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

జీఎంపీ రూ. 1350 వారీ ఎనర్జీస్ ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ఒక్కో షేరుకు రూ. 1310. కంపెనీ తన షేరు ధరను రూ. 1503 వద్ద ఉంచింది. ఈ పరిస్థితుల్లో ఐపీఓను ఒక్కో షేరుకు రూ. 2813 చొప్పున లిస్ట్ చేయవచ్చు. అంటే ఇన్వెస్టర్లకు 87.16 శాతం లాభం వస్తుంది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 9 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది, అంటే కనీసం రూ. 13,527 ఇన్వెస్ట్ చేయాలి.

30 జూన్, 2023 నాటికి కంపెనీ దేశంలో మొత్తం 136.30 ఎకరాల విస్తీర్ణంలో 4 తయారీ కేంద్రాలను నిర్వహిస్తుంది. ఇవి దేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, తుంబ్, నందిగ్రామ్ అండ్ చిక్లీలో ఉన్నాయి. 2024 జూన్, 30తో ముగిసిన 3 నెలల కాలానికి వారీ ఎనర్జీస్ రూ. 3,496.41 కోట్ల ఆదాయంతో రూ. 401.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 11,632.76 కోట్ల ఆదాయంతో రూ. 1,274.38 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version