Mg Motors April Sales: భారత ఆటోమోబైల్ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రీమియం వాహన తయారీ సంస్థ MG Motors.చైనాకు చెందిన SAIC Motor యాజమాన్యంలో ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలుగా JSW గ్రూప్ పెట్టుబడులతో ఇది స్థానిక కంపెనీగా బలపడింది. అత్యాధునిక సాంకేతికత (AI, కనెక్టెడ్ కార్), అద్భుతమైన డిజైన్ మరియు EV (ఎలక్ట్రిక్) విభాగంలో టాటాకు గట్టి పోటీ ఇస్తూ, SUVల తయారీలో తనదైన ముద్ర వేసింది.
ఎంజీ మోటార్ ఇండియా ఏప్రిల్ 2026లో మొత్తం విక్రయాల్లో దాదాపు 3.24శాతం పెరుగుదలతో గణనీయమైన వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్లో 5,829 యూనిట్లను విక్రయించిన ఈ కంపెననీ 2026 ఏప్రిల్లో 6,018 యూనిట్ల సేల్స్ చేసింది. మొత్తం విక్రయాల్లో 189 యూనిట్ల పెరుగుదల నమోదు చేసింది. పశ్చిమ ఆసియాలో సంక్షోభం, గ్లోబల్ సప్లై‑చైన్ అంతరాయాలు ఉన్నా కూడా ఈ వృద్ధి సాధ్యమైంది.
ఎంజీ విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన శక్తిగా నిలిచాయి. విండ్సర్ ఈవీ కంపెనీకి టాప్ సెల్లర్గా కొనసాగింది. మార్చి 2026లో ఈ మోడల్ 4,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. హెక్టార్ రేంజ్ కన్వెన్షనల్ పెట్రోల్/డీజిల్ మోడల్గా స్థిరమైన క్రమంలో నిలిచి 850 యూనిట్లు విక్రయించడం ద్వారా బ్రాండ్ కి సుస్థిరత కల్పించింది.
ఈ కంపెనీకి చెందిన చిన్న సైజ్ కారు కామెట్ ఈవీ పెద్ద ప్రభావం చూపిస్తోంది. మార్చి 2026లో ఇది 682 యూనిట్ల విక్రయాలు నమోదు చేసుకుంది. గత ఏడాదితో పోలీస్తే 294 శాతం వృద్ధి నమోదు చేయడం ద్వారా మార్కెట్లో క్రేజ్ సంపాదించింది. అదే విధంగా జెడ్ఎస్ ఈవీ (ZS EV) కూడా మార్చిలో 411 యూనిట్లు అమ్మడం ద్వారా స్థిరమైన ప్రదర్శన కనబరిచింది. ఏప్రిల్ లెక్కల్లో కూడా ఈ మోడల్లు సంస్థ ఈవీ పోర్ట్ఫోలియోను బలపరిచాయని సంస్థ వారు పేర్కొంటున్నారు.
2026 మార్చిలో ఎంజీ మొత్తం 6,528 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్లో 6,018 యూనిట్లు మాత్రమే విక్రయించింది. నెలవారీ అమ్మకాలు చూస్తే 7.81 శాతం పతనం నమోదైంది. అయినప్పటికీ గత ఏప్రిల్తో పోలిస్తే వృద్ధి ఉన్నా.. నెలవారీ మాత్రం తగ్గుదల కనిపిస్తుంది.
ఏప్రిల్ మార్కెట్లో ప్రస్తుత అస్థిరత ఉన్నా కూడా ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను మరింత పెంచుతూ, విండ్సర్, హెక్టార్, కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ వంటి మోడల్లతో భారత మార్కెట్లో ఎంజీ మోటార్స్ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ప్రణాళికలు ముఖ్యంగా మధ్యస్థ, పెద్ద మధ్యస్థ మరియు పట్టణ కస్టమర్లను టార్గెట్ చేసుకుంటే, ముందు వచ్చే త్రైమాసికాల్లో విక్రయాల్లో మరింత పెరుగుదల సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.