Lalitha Jewellers: డబ్బు ఎవరికీ ఊరికే రాదు. మా సంస్థకు ఒకసారి రండి. ఇతర సంస్థలకు ఒకసారి వెళ్లండి. ధరలు పోల్చి చూసుకోండి. ఒకే ఒక ఈ ప్రకటనతో బంగారం వ్యాపారాన్ని మొత్తం పూర్తిగా మార్చేశాడు కిరణ్ అలియాస్ గుండు కిరణ్. పోటీ సంస్థలు సెలబ్రిటీలతో ప్రకటనలు రూపొందిస్తుంటే.. ఇతడు మాత్రం తనకు తానే ప్రచారం చేసుకున్నాడు. ఫలితంగా మీడియాలో ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. గోల్డ్ బిజినెస్ లో తమిళనాడు.. మలయాళం వ్యాపారులు ఎప్పటినుంచో కింగ్ మేకర్లుగా ఉన్నారు. అయితే వారిని అధిగమించాడు కిరణ్.
Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..
లలిత జ్యువెలర్స్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి అనేక శాఖలు ఏర్పాటు చేశాడు. లలిత జ్యువెలర్స్ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. తమిళనాడు.. కేరళ వంటి ప్రాంతాలలో శాఖలు ఉన్నాయి. వీటిల్లో భారీగానే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు గుండు కిరణ్. ఎప్పటికప్పుడు తన వ్యాపారం గురించి.. తన సంస్థ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న బంగారు ఆభరణాల గురించి ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తూ.. వీక్షకులతో పంచుకుంటాడు.
ఇటీవల కాలంలో గుండు కిరణ్ కుమార్ తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. వ్యాపారంతో పాటు విహారయాత్రలకు ప్రాధాన్యమిస్తున్నాడు. వాటిని వీడియోలుగా రూపొందించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా తన స్నేహితులతో కలిసి అతడు ఓ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కుర్మా తయారు చేశాడు. చపాతీలు కూడా తయారు చేశాడు. తన స్నేహితులకు వడ్డించాడు. పైగా ఇలా కూర్మ చేసుకుని తింటే.. అందులో చపాతీలను కలుపుకొని తింటే ఎంతో బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది. అంతేకాదు గుండు కిరణ్ కుమార్ లో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించింది. ఎంతైనా కిరణ్ కుమార్ రేంజ్ వేరు. ఎందుకంటే అతడు వ్యాపారం చేయగలడు.. వంట కూడా చేయగలడు.. చివరికి తన బిజినెస్ ను తనే ప్రమోట్ చేసుకోగలడు.
