PC Jeweller Share: 1:10 స్టాక్ స్ప్లిట్ ప్రకటన తర్వాత PC జ్యువెలర్ స్టాక్ ఎంత మేరకు వెళ్లిందంటే?

పీసీ జ్యువెల్లర్స్ కంపెనీ 1:10 స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటించిన తర్వాత, అక్టోబర్ 1 - మంగళవారం రోజు పీసీ (PC) జ్యువెలర్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ చేయబడ్డాయి. 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో స్టాక్ లాక్ కావడం ఇది వరుసగా నాలుగో సెషన్.

Written By: Mahi, Updated On : October 1, 2024 4:33 pm

PC Jeweller Share

Follow us on

PC Jeweller Share: పీసీ జ్యువెల్లర్స్ కంపెనీ 1:10 స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటించిన తర్వాత, అక్టోబర్ 1 – మంగళవారం రోజు పీసీ (PC) జ్యువెలర్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ చేయబడ్డాయి. 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో స్టాక్ లాక్ కావడం ఇది వరుసగా నాలుగో సెషన్. పీసీ జ్యువెలర్ షేర్ ధర ఈ రోజు ఒక్కొక్కటి ₹ 184.70 వద్ద ప్రారంభమైంది. దాని 52 వారాల గరిష్ట స్థాయికి కూడా లాభాలను ₹ 186.80కి పొడిగించింది. లిక్విడిటీని మెరుగు పరిచేందుకు, రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లను మరింత సరసమైనదిగా చేసేందుకు 1:10 స్టాక్ స్ప్లిట్‌ను సెప్టెంబర్ 30, 2024న డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ చర్య కంపెనీ చేసిన అధికారిక ఫైలింగ్ ప్రకారం.. ₹ 10 ముఖ విలువ గల పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్‌ ఒక్కొక్కటి ₹ 1 చొప్పున 10 షేర్లుగా విభజించింది. ఫలితంగా మొత్తం షేర్ల సంఖ్య దాదాపు 46.5 కోట్ల నుంచి 465.4 కోట్లకు పెరగనుంది.

షేర్ ధర హిస్టరీ..
పీసీ జ్యువెలర్ షేర్ ధర గత సంవత్సరంలో 563.12 శాతం పెరిగింది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు 246.4 శాతం పెరిగింది. గత మూడు, ఆరు నెలల్లో, స్టాక్ వరుసగా 241.6 శాతం, 225 శాతం ఆకట్టుకునే మల్టీ బ్యాగర్ రాబడిని అందించింది. సెప్టెంబర్‌లో ఈ షేరు 60 శాతం ర్యాలీ చేసింది. ఇది మే 2018 నుంచి సెప్టెంబర్ 30న అత్యధిక స్థాయిలో ట్రేడ్ అవుతోంది. జనవరి 16, 2018న ఈ స్టాక్ ₹ 600.65 గరిష్ట స్థాయిని తాకింది.

బీఎస్ఈలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. కంపెనీ ₹ 8,693.74 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను పొందుతోంది. అదనంగా, రెండు ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు-న్యూ ట్రాక్ గార్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన 11.5 కోట్ల పూర్తిగా కన్వర్టబుల్ వారెంట్ల ప్రాధాన్యత కేటాయింపును బోర్డు ఆమోదించింది.

బలరామ్ గార్గ్ (HUF) లిమిటెడ్.. ఒక్కో వారెంట్‌కు ₹ 56.20 ఇష్యూ ధరతో కంపెనీ యొక్క ఈక్విటీ షేర్లుగా మార్చుకోగలిగే ఈ వారెంట్‌లు ₹ 646 కోట్లను సమీకరించాయి. ప్రారంభ 25 శాతం సబ్‌ స్క్రిప్షన్‌ను ముందుగా స్వీకరించారు. ఇష్యూ ధరలో మిగిలిన 75 శాతాన్ని ప్రమోటర్లు ఈక్విటీ షేర్లలోకి పూర్తి మార్పిడి కోసం కేటాయింపు తేదీ నుంచి 18 నెలల్లోపు చెల్లించాలి.