Homeబిజినెస్Gold prices today: పతనమవుతున్న బంగారం ధరలు.. ఈరోజు ధర తెలిస్తే షాక్ అవుతారు..

Gold prices today: పతనమవుతున్న బంగారం ధరలు.. ఈరోజు ధర తెలిస్తే షాక్ అవుతారు..

Gold Price Today: కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ తో పాటు వివిధ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరల తగ్గుతున్నాయి. అయితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తమవుతుండగా.. ఇన్వెస్ట్ మెంట్ దారుల్లో నిరాశ కలుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆషాఢం అయినా.. బంగారం ధర తగ్గడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 26న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.98,950గా ఉంది. జూన్ 25న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.89,100తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువారం రూ.1,000 తగ్గింది. అటు 24 క్యారెట్ల బంగారం పై కూడా ఇదే స్థాయిలో తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Also Read: IRCTC Refund Rules 2025: రైలు ప్రయాణంలో అసౌకర్యమా.. ఇలా చేస్తే మీ డబ్బులు వాపస్‌!

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.98,950గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.98,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,950తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు తగ్గినా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,08,000గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం ధరల స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.1,08,000గా ఉంది. ముంబైలో రూ.1,08,000, చెన్నైలో రూ.1,18,000 బెంగుళూరులో 1,08,000, హైదరాబాద్ లో రూ. 1,18,000 తో విక్రయిస్తున్నారు.

Also Read: OYO hidden camera warning: ఓయో రూంలకు వెళ్తున్నారా? ఎందుకైనా మంచిది ఈ వీడియో ఒకసారి చూడండి..

వివిధ దేశాల్లో యుద్ధవాతావరణం నెలకొనడంతో చాలా మంది బంగారం, వెండిపై పెట్టుబడలు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అలాగే రాజకీయంగా కూడా అనిశ్చితి ఏర్పడడంతో వీటికి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. అయితే కొన్ని రోజుల తరువాత మళ్లీ వీటి కొనుగోలు పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version