Homeబిజినెస్Gold Price Drop In India: బంగారం మెరుపులు డౌన్.. ఎందుకీ పరిస్థితి అంటే..

Gold Price Drop In India: బంగారం మెరుపులు డౌన్.. ఎందుకీ పరిస్థితి అంటే..

Gold Price Drop In India: నిజమే.. మీరు చదివింది పూర్తిగా నిజమే. నిన్నటిదాకా రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. కొనుగోలుదారులతో సందడిగా ఉన్న దుకాణాలు ఇప్పుడు రద్దీ లేక ఇబ్బంది పడుతున్నాయి. వాస్తవానికి గోల్డ్ కు డిమాండ్ తగ్గడం నిజంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది.. దీని వెనుక కారణాలు ఎలా ఉన్నప్పటికీ.. బంగారం డిమాండ్ తగ్గడం ఇప్పుడు మార్కెట్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.

మనదేశంలో గోల్డ్ వినియోగం ఎప్పటికీ ఒక స్థాయిలోనే ఉంటుంది. కొంతకాలంగా బంగారం వినియోగం అనేది సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వేడుకలు.. పెళ్లిళ్లు.. ఇతర ఉత్సవాల సమయంలో బంగారాన్ని భారతీయులు కచ్చితంగా కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధర విపరీతంగా పెరిగింది. దీనివల్ల బంగారం కొనే వారి సంఖ్య తగ్గింది. కాకపోతే బంగారం అనేది మధ్యతరగతి.. దిగువ తరగతి వాళ్లకు మాత్రమే దూరమైంది. ఆగర్భ శ్రీమంతులు స్థిరమైన పెట్టుబడిగా బంగారాన్ని భావించి.. భారీగా కొనుగోలు చేస్తున్నారు.

బంగారాన్ని డబ్బున్న వాళ్ళు భారీగా కొనుగోలు చేయడం వల్ల విదేశాల నుంచి భారత్ అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి. అందువల్లే ఇటీవల భారత ప్రభుత్వం బంగారం మీద కీలక ప్రకటన చేసింది. సుంకాన్ని ఆరు నుంచి పదిని శాతం పెంచేసింది. దీనివల్ల బంగారం విలువ.. ధర విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బంగారం 10 గ్రాములు 24 క్యారెట్ల ధర సుమారు 1,60,000 వరకు చేరుకుంది. దీంతో ప్రజలు కేవలం అవసరమైతేనే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అమ్మకాల పరిమాణం తగ్గిపోయినప్పటికీ.. బంగారం విలువ మాత్రమే విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బంగారాన్ని కొనుగోలు చేసినప్పటికీ.. ధర మాత్రం విపరీతంగా చెల్లించాల్సి వస్తోంది. అందువల్లే జ్యువెలరీ కంపెనీలు తమ ఆదాయాన్ని 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కంపెనీలు అమ్మే బంగారం పరిమాణం తగ్గుతోంది. కాకపోతే ధరల వల్ల వారి ఆదాయం పెరుగుతోంది..

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసెల్ తన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. మనదేశంలో బంగారు ఆభరణాల అమ్మకాలు తగ్గుతున్నట్టు ప్రకటించింది. ప్రజలు కొనుగోలు చేస్తున్న బంగారం బరువు తగ్గుతోందని పేర్కొంది. ఈ సంవత్సరంలో బంగారు ఆభరణాల అమ్మకాలు ఎనిమిది శాతం తగ్గాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఆ శాతం 15 వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. గడచిన పది సంవత్సరాల కాలంలో ఇదే అత్యంత స్వల్ప స్థాయి అని వెల్లడించింది. ధరల లో విపరీతమైన పెరుగుదల.. దిగుమతి సుంకం అనేది పెరగడం వల్ల బంగారంలో ఈ స్థాయి మార్పులు వచ్చాయని క్రిసిల్ ప్రకటించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version