Coca Cola Liquor : ఇక కోకాకోలాతో కిక్కే కిక్కు.. తాగి ఊగాల్సిందే

ఇటీవల, కోకా కోలా రూ.3,300 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సనంద్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Written By: NARESH, Updated On : December 14, 2023 10:30 pm
Follow us on

Coca Cola Liquor : ప్రపంచంలోనే అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ కోకాకోలా. దశాబ్దాలుగా సాఫ్ట్‌ డింక్‌ సామ్రాజ్యాన్ని ఏలుతోంది. ఈరంగంలో పోటీ పెరగడంతో తాజాగా దిగ్గజ కంపెనీ లిక్కర్‌ వ్యాపారంలోకి దిగింది. భారత దేశంలోనే మద్యం తయారీ ప్రారంభించింది.

మార్కెట్‌లోకి ఫస్ట్‌ బ్రాండ్‌..
మద్యం తయారు చేస్తున్న కోకాకోలా కపెనీ ఇటీవలే లెమన్ డౌ విస్కీని మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని విక్రయిస్తున్నారు. దీని 250 ml క్యాన్ ధర రూ.230గా ఉంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, లెమన్-డౌ, జపాన్‌ నుంచి వచ్చింది. ఇక్కడ దీనిని చుహై కాక్‌టెయిల్ అని పిలుస్తారు. ఇది బ్రాందీ – వోడ్కా వంటి డిస్టిల్డ్ మద్యం. ఇది ఇప్పటికే ప్రపంచంలోని అనేక మార్కెట్లలో అందుబాటులో ఉంది.

లెమన్-డౌ అంటే…
లెమన్ డౌ అనేది ఒక రకమైన ఆల్కహాల్ మిక్స్. ఇది షోషు నుండి తయారు చేయబడింది. ఇందులో వోడ్కా, బ్రాందీ వంటి డిస్టిల్డ్ లిక్కర్ ఉపయోగించబడుతుంది. కోకా కోలా ఇండియా ప్రతినిధి ప్రకారం, ఇది వివిధ ప్రదేశాలలో తయారు చేయబడుతోంది.

మద్యం మార్కెట్‌ను ఏలాలని..
శీతల పానీయాల మార్కెట్‌ను పూర్తిగా కైవసం చేసుకున్న తర్వాత, గ్లోబల్ కంపెనీలు కోక్ -పెప్సీ ఇప్పుడు మద్యం విభాగంపై కన్నేశాయి. రెండు కంపెనీలు ఒక్కొక్కటిగా ఈ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. కోక్ గతంలో జపాన్‌లో కూడా లెమన్ డౌ ఉత్పత్తిని విడుదల చేసింది. పెప్సికో అమెరికన్ మార్కెట్‌లో మౌంటెన్ డ్యూ ఆల్కహాలిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. ఇటీవల, కోకా కోలా రూ.3,300 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సనంద్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.