Anant Ambani Pre Wedding: మిరపకాయ బజ్జీలంటే ముకేశ్ అంబానికి అంతిష్టమా.. వీడియో వైరల్

ముందస్తు పెళ్లి వేడుకలను పురస్కరించుకొని ముకేశ్ అంబానీ ముంబైలో సుమారు 50 వేల మందికి అన్న సేవ పేరుతో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ, తన భార్య నీతా అంబానీ, కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ తో కలిసి అందరికీ భోజనాలు వడ్డించారు.

Written By: Suresh, Updated On : March 3, 2024 5:47 pm

Anant Ambani Pre Wedding

Follow us on

Anant Ambani Pre Wedding: ముకేశ్ అంబానీ.. మనదేశంలో అతిపెద్ద శ్రీమంతుడు. లక్షల కోట్లకు అధిపతి. వేలాది మంది ఉద్యోగులకు ఓనర్. దేశవ్యాప్తంగా ఆయనకు ఎన్నో కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ప్రస్తుతం జామ్ నగర్ వేదికగా ఆయన చిన్న కొడుకు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో ముకేశ్ అంబానీ సందడి చేస్తున్నారు. కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఆ వేడుకలకు సంబంధించి కొన్ని వీడియోలు బయటికి వస్తున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ముందస్తు పెళ్లి వేడుకలను పురస్కరించుకొని ముకేశ్ అంబానీ ముంబైలో సుమారు 50 వేల మందికి అన్న సేవ పేరుతో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ, తన భార్య నీతా అంబానీ, కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ తో కలిసి అందరికీ భోజనాలు వడ్డించారు. ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించి ఆహార పదార్థాలు ప్లేట్లో వడ్డించారు. ఇలా సుమారు 50,000 మందికి అన్న సేవ నిర్వహించారు. ఈ అన్న సేవలో శాఖాహారానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. వీటిని వండేందుకు మధ్యప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా పాకశాస్త్ర నిపుణులను రప్పించారు.

అన్న సేవలో భాగంగా భోజనాలు వడ్డించిన తర్వాత.. వాటిని ముఖేష్ అంబానీ స్వయంగా రుచి చూశారు.. అందులో మిరపకాయ బజ్జీలను కడుపునిండా తిన్నారు. అలా ఆయన బజ్జీలు తింటుండగా కొంతమంది తమ ఫోన్ల ద్వారా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో అవి తెగ చక్కర్లు కొడుతున్నాయి. “లక్షల కోట్లకు అధిపతి అయినప్పటికీ.. ఏ మాత్రం భేషజం చూపించడం లేదు.. పైగా తనకిష్టమైన మిరపకాయ బజ్జీలను తృప్తిగా ఆరగిస్తున్నారు. వర్త్ 10 లక్షల కోట్లు.. ఆటిట్యూడ్ జీరో..” అని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. “మిరపకాయ బజ్జీలు అంటే ముఖేష్ అంబానికి చాలా ఇష్టం అనుకుంటా.. అందుకే హాయిగా తింటున్నారు” అని మరికొందరు కామెంట్లు చేశారు. కాగా, శనివారం అనంత్ అంబానీ తన కుటుంబం గురించి మాట్లాడినప్పుడు ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. అనంత్ చెబుతున్న మాటలు విని కన్నీరు కార్చారు.