బిజినెస్Anand Mahindra RBI: నిమిషాల్లోనే లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదిరిపోయింది.. ఆనంద్ మహీంద్రా ప్రశంస..

Anand Mahindra RBI: నిమిషాల్లోనే లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదిరిపోయింది.. ఆనంద్ మహీంద్రా ప్రశంస..

Anand Mahindra RBI: మార్కెట్లో రుణాల లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో.. అవసరమైన వారికి రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ టెక్ ప్లాట్ ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్(పీటీపీఎఫ్సీ) ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్లో ప్రదర్శించింది. ఈ ప్రక్రియ రుణాల మంజూరును వేగవంతం చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. తయారీ రంగం, సేవల రంగం బలోపేతం అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అయితే ఈ విధానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సమర్ధించారు. బోర్డ్ ఆఫ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన బాగుందని కితాబిచ్చారు. రుణ గ్రహీతలు, రుణ సంస్థలను అనుసంధానించి, తక్కువ మొత్తంలో తీసుకోవాలనుకునే వారికి తీసుకురావడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్ ఈ పీటీపీఎఫ్సీ ని రూపొందించింది. ఈ ప్లాట్ ఫామ్ రూ. 1.6 వరకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, ఎంఎస్ఎంఈ లకు నాన్_ కొలేటరల్ ఆధారిత రుణాలు, హోమ్ లోన్లు, డెయిరీ లోన్లు, వ్యక్తిగత రుణాల మంజూరులో సహాయపడుతుంది.

దీనికి సంబంధించి జరిగిన ఆర్బిఐ బోర్డు సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు. ఆ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ లో పంచుకున్నారు. “కొన్నిసార్లు ముందు వరుసలో సీటు దక్కించుకోవడం మహా గొప్పగా ఉంటుంది. ఇండోర్ లో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశంలో పాల్గొన్న మాకు పీటీపీఎఫ్సీ ప్రాజెక్టును ప్రదర్శించారు. ఇది కేవైసీ ప్రక్రియలు, డాక్యుమెంట్లను సమీకృతం చేయడం ద్వారా రుణం మంజూరు చేయడానికి పట్టే సమయాన్ని రోజుల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. దీని ద్వారా గ్రామీణ ఖాతాదారులకు క్రెడిట్ డెలివరీ మెకానిజంలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ఓపెన్ ప్లాట్ ఫామ్. దీనిని ఉపయోగించుకోవాలనుకునే అన్ని బ్యాంకులకూ అందుబాటులో ఉంటుంది. భారత్ డిజిటల్ పోల్ పొజిషన్ ను మరింత వేగంగా తీసుకుంటోంది. దీనివల్ల మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అభినందనలు” అంటూ ఆనంద్ మహీంద్రా రాస్కొచ్చారు. పీటీపీఎఫ్సీ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను కూడా జత చేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన విధానం స్వల్పకాలిక వ్యాపారాలు చేసే వారికి, రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోవిడ్ తర్వాత రుణాల లభ్యత తగ్గిపోవడంతో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చాలావరకు ఉద్యోగాలు పోయాయి. ఉపాధి లేక చాలామంది నగరాల నుంచి ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక రంగం గాడిలో పడుతున్న నేపథ్యంలో తయారీ రంగం, సేవల రంగం, వస్తు ఉత్పత్తి రంగానికి చేయూతనిచ్చే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విధానం పూర్తిస్థాయిలోకి అమలులోకి వస్తే పలు రంగాలు తిరిగి గాడిలో పడడం ఖాయమని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు భారీ షాక్

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...

Anand Mahindra: ఏపీకి అన్ స్టాపబుల్ ఫోర్స్ చంద్రబాబే

Anand Mahindra: మనదేశంలో ఎంతోమంది వ్యాపారులు ఉన్నారు. వారంతా కూడా లక్షల నుంచి మొదలుపెడితే వందల కోట్ల వరకు వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు.. దేశ అభివృద్ధిలో...

Most Popular

Tata Avinya X

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...
Honor X7e Plus 5G

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....
Mahindra Vision T

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...
Jio

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...