Bigg Boss 5 Telugu: పదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో ఒకపాటి దుమారమే లేపుతుంది. అందరూ టాప్ కంటెస్టెంట్స్ ఉండడం వలన పదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ చాలా ఆసక్తికరం గా సాగుతున్నది. ప్రతి వారం వారం తన పంథాను మార్చుకుంటూ కొత్తగా నామినేషన్ల ప్రక్రియని ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్. అలాగే సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియ కూడా ఎప్పుడు జరగని విధంగా జరిగింది.
విన్నూత్నంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ: సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ మొట్ట మొదట కెప్టెన్ అని మాస్టర్ ని ప్రారంభించమన్నాడు బిగ్ బాస్. ఈ క్రమం లో నలుగురి ఇంటి సభ్యులని ఎంచుకుని, తగిన కారణాలు చెప్పి వాళ్ళని నామినేట్ చేసి జైల్లో పెట్టవలసిందిగా బిగ్ బాస్ కెప్టెన్ అని మాస్టర్ ని ఆదేశించాడు. అయితే కెప్టెన్ అని మాస్టర్ ముందుగా కాజల్ ని ఎంచుకోగా, తర్వాత సన్నీ, వరుసగా మానస్, షణ్ముఖ్ ఎంచుకుంటూ నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పి జైల్లో పెట్టింది.
కాజల్, సన్నీ, మానస్, షణ్ముఖ్ ని జైల్లో వెయ్యగానే మొదటి లెవెల్ అయిపోయింది అని బిగ్ బాస్ అనౌన్సమెంట్ ఇచ్చాడు. లెవెల్ రెండు లో భాగం గా మిగతా నామినేట్ అవ్వని సభ్యులు బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియా లో ఉన్న సంకెళ్లని పట్టుకుని తమకి ఇష్టమైన వాళ్ళని జైల్లో నుండి విడిపించవచ్చని చెప్పాడు బిగ్ బాస్. ఇక చివరలో జైలులో మిగిలిన సిరి, రవి, మానస్, సన్నీ నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ మరోసారి కెప్టెన్ అని మాస్టర్ కి ఇంకో బంపర్ అఫర్ ఇచ్చాడు. ఇంటి సభ్యులలో నుండి ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించగా ఇంకో ఆలోచన లేకుండా అని మాస్టర్ కాజల్ ని నామినేట్ చేసింది. అలా బిగ్ బాస్ ఇంటి నుండి పదో వారానికి గాను సిరి, రవి, మానస్, సన్నీ, కాజల్ నామినేట్ అయ్యారు.
అయితే అన్ ఆఫీషయల్ వెబ్సైట్లలో చూస్తుంటే పోలింగ్ లో చివర ఉన్నది మానస్, కాజల్. డేంజర్ జోన్లో ఉన్న ఈ ఇద్దరిలో ఒక్కరు కచ్చితంగా బిగ్ బాస్ ఇంటిని వీడతారని సామజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం తెలుసు కోవాలంటే ఆదివారం జరిగే ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే.