కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టికి నిరాశావాదం ఏమాత్రం పనికిరాదని, బీజేపీ లాగా ఆలోచిస్తూ, బీజేపీని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఫలితాలను చూసి ఎవరూ కుంగిపోవద్దని, పార్టీ భూమికను కోల్పోకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ పై వ్యాఖ్యలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో చాలా బలహీనంగా ఉన్నామని, ఓ రాష్ట్రంలో బలమైన ఉనికిని ప్రదర్శిస్తున్నామని ఎప్పుడూ భావించకూడదన్నారు.