అంకులు హత్యతో వైసీపీకి సంబంధం లేదు:కాసు

గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన టీడీపీ మాజీ సర్పంచ్ హత్యతో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన మాట్లాడుతూ అంకులు హత్యను తాము ఖండిస్తున్నామని, యరపతినేని రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిందితులను పట్టుకోవాలని తాము డీజీపీని కోరుతామన్నారు. అటు అంకులు హత్య కేసును ఛేదించేందుకు 3 ప్రత్యేక బ్రుందాలు ఏర్పాటు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గన్నీ తెలిపారు. దాచేపల్లి మండలంపెదగార్లపాడు […]

Written By: Suresh, Updated On : January 4, 2021 3:54 pm
Follow us on

గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన టీడీపీ మాజీ సర్పంచ్ హత్యతో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన మాట్లాడుతూ అంకులు హత్యను తాము ఖండిస్తున్నామని, యరపతినేని రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిందితులను పట్టుకోవాలని తాము డీజీపీని కోరుతామన్నారు. అటు అంకులు హత్య కేసును ఛేదించేందుకు 3 ప్రత్యేక బ్రుందాలు ఏర్పాటు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గన్నీ తెలిపారు. దాచేపల్లి మండలంపెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నేత పురంశెట్టి అంకులును నిన్న గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి చంపారు.