రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెనుపాడుకు చెందిన ఓ జంటకు తిరుమలలో వివాహం జరిగింది. అనంతరం రెండు కుటుంబాల బంధువులు తమ స్వగ్రామమైన తెనాలికి వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఒంగోలులో వీరి వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో పెళ్లి బృందం వాహనం నుజ్జునుజ్జవడంతో అందులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, అన్నపూర్ణమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులుు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం […]

Written By: Suresh, Updated On : November 22, 2020 12:35 pm
Follow us on

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెనుపాడుకు చెందిన ఓ జంటకు తిరుమలలో వివాహం జరిగింది. అనంతరం రెండు కుటుంబాల బంధువులు తమ స్వగ్రామమైన తెనాలికి వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఒంగోలులో వీరి వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో పెళ్లి బృందం వాహనం నుజ్జునుజ్జవడంతో అందులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, అన్నపూర్ణమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులుు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప అసుపత్రికి తరలించారు.కాగా ఇద్దరు మృతి  చెందడంతో వారి బంధవుల్లో విషాదం నెలకొంది.