
ఈ నెల 21న సాయంత్రం 5 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరిగి జనవరి 3 నుంచి టోకెన్ల జారీని ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 24 నుంచి టీటీడీ జారీ చేయనున్న లక్ష ఎస్డీ టోకెన్లు కేవలం తిరుపతి ప్రజలకే పరిమితం చేశారు. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఇతర ప్రాంతాల వారికీ టోకెన్లు జారీ చెయ్యబోమని టీటీడీ ప్రకటించింది.