విజయవాడ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలంలో అటెండర్గా ఉద్యోగం చేస్తున్న మహేశ్ స్నేహితులతో కలిసి శివారుకు వెళ్లాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి మహేశ్పై కాల్పులు జరిపారు. దీంతో మహేశ్తో ఉన్న స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే స్థానికులు గుర్తించి మహేశ్ను ఆసుపత్రికి తరలించేలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహేశ్ గొంతు, చాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలిపారు.