
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ సాగింది. మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టులో తమ వాదన వినలేదని రాయలసీమకు చెందిన కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషన్ నేత్రుత్వంలో ధర్మాసనం కొట్టివేసింది. చట్టాలను ప్రభుత్వాలు సమర్థించుకుంటాయి కదా అని అశోక్ భూషన్ పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులపై గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసింది. అప్పటి నుంచి ఈ అంశంపై హైకోర్టులో విచారణ సాగుతోంది. తాజాగా కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లగా మూడు రాజధానుల విషయంలో ఏవైనా మద్దతుగా ఏవైనా సంస్థలు పిటిషన్లు వేస్తే పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది.