భార్యతో గొడవ: భర్త ఆత్మహత్య

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వ్యాయామ టీచర్ గా పనిచేస్తున్న రామక్రుష్ణ కుటుంబంతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో నివసిస్తున్నాడు. ఈనెల 16న  రామక్రుష్ణ ఇంటికి బంధువులు వచ్చారు. అయితే కూరగాయలు తెమ్మని భార్య సంధ్య చెప్పింది. దీంతో మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకొచ్చిన భర్తపై అవి బాగా లేవని గొడవ పెట్టుకుంది. దీంతో ఈ గొడవ పెద్దదిగా మారడంతో భార్య సంధ్య తన […]

Written By: Velishala Suresh, Updated On : December 27, 2020 10:59 am
Follow us on

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వ్యాయామ టీచర్ గా పనిచేస్తున్న రామక్రుష్ణ కుటుంబంతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో నివసిస్తున్నాడు. ఈనెల 16న  రామక్రుష్ణ ఇంటికి బంధువులు వచ్చారు. అయితే కూరగాయలు తెమ్మని భార్య సంధ్య చెప్పింది. దీంతో మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకొచ్చిన భర్తపై అవి బాగా లేవని గొడవ పెట్టుకుంది. దీంతో ఈ గొడవ పెద్దదిగా మారడంతో భార్య సంధ్య తన పిల్లలతో కలిసి ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. మనస్థాపానికి గురైన రామక్రుష్ణ ఉరివేసుకున్నాడు. గమనించిన భార్య సమీపంగా ఉన్న వారితో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లింది. కాగా చికిత్స పొందుతూ రామక్రుష్ణ  మరణించాడు.  చిన్న గొడవతో ప్రాణాలు తీసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.