కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు సైతం తాము ఆందోళనకు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహకరించుకునేవరకు పోరాటం కొనసాగించాలన్నారు. అలాగే ఈనెల 8న తలపెట్టిన బంద్ కు టీడీపీ సహకరిస్తుందని తెలిపారు. బంద్ లో పార్టీ నాయకులు పాల్గొనాలని సూచించారు. కాగా ఢిల్లీలో రైతులు ఆందోళనను ఆదివారమూ కొనసాగిస్తున్నారు.