
ఏపీలో ఇవాళ కొత్తగా 402 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 412 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,79,339 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,68,279 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,978 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,082 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 56,425 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,13,57,530 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.