ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయనకు గురువారం జ్వరం తీవ్రమవడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఉదయం నుంచి బాగా నీరసంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు చికిత్స నిమిత్తం అక్కడికి పంపించారు. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్డు మార్గం బాగా లదు. దీంతో ఆయనను విజయవాడ నుంచి హైదరాబాద్కు హెలీక్యాప్టర్లో తరలించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతిలో బ్రహ్మూెత్సవాల సమయంలో పాల్గొన్న మంత్రికి ఆ తరువాత కరోనా సోకింది. ఆ సమయంలో జరగ్ కూడా మంత్రితో ఉండడం గమనార్హం.