Pawan Kalyan: నీతులు చెప్పడం ఈజీ. సుద్దపూసలాగా మాట్లాడటం మరింత ఈజీ. కానీ వాటిని అనుసరించడం.. ఆచరించడం అంత ఈజీ కాదు. పాపం ఈ విషయంలో వైసిపి ప్రతిసారి బొక్క బోర్లా పడుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఆ పార్టీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు బుద్ధి రాదు.. కనీసం విచక్షణ ఉండదు.
రావణ్ అలియాస్ జోసెఫ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసిన హంగామా మామూలుది కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా అతడు ఏ స్థాయిలో విమర్శించాడు, ఉగ్రవాదులకు ఏ విధంగా వంత పాడాడు, భారతదేశాన్ని ఏ విధంగా తిట్టాడు, పురాణాలను, సనాతన ధర్మాన్ని, హిందువులు గొప్పగా పూజించే దేవుళ్లను ఏ విధంగా విమర్శించాడు.. అనేవి అతని వీడియోలను చూస్తే తెలుస్తుంది. అతనికి వంతపాడే కొంతమందికి ఇవి కనిపించడం లేదా.. కనిపించినప్పటికీ కావాలని నాటకాలు ఆడుతున్నారా అర్థం కావడం లేదు.
ప్రశ్నించడం మంచిదే. కానీ అది సమస్యను ఎత్తి చూపించే విధంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఉండకూడదు. ఇంట్లో వాళ్లను దూషించే విధంగా ఉండకూడదు. కానీ రావణ్ అలియాస్ జోసెఫ్ ఎంచుకున్న విధానం మాత్రం వేరే విధంగా ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడటం.. బండ బూతులు తిట్టడం.. వ్యక్తిగత అంశాలను బజార్లో పెట్టడాన్ని అతడు విమర్శించడం అనుకున్నాడు. పైగా దేశం మీద ప్రేమ లేదు అని చెప్పడాన్ని అతడు చాలా గొప్పగా భావించాడు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడానికి అతడు ఈ దేశం కల్పించిన హక్కుగా అనుకున్నాడు. చివరికి దేశద్రోహం కేసు కింద అరెస్టు అయ్యాడు.
ఇక్కడ జోసెఫ్ కి వంత పాడుతున్న వైసిపి.. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చేసిందో మర్చిపోతే ఎలా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. కారు మీద ఎక్కి కూర్చున్నాడని కేసు పెట్టారు. సీఎం సెక్యూరిటీ కూడా తీసేసి విశాఖపట్టణంలో ఓ హోటల్ ముందు సెక్యూరిటీగా పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులను కాపలాగా పెట్టారు. ఆయన సినిమా విడుదల అవుతుంటే టికెట్ల రేట్లు తగ్గించమని జీవోలు జారీ చేశారు. సర్పంచి నుంచి మొదలు పెడితే ఐఏఎస్ అధికారుల వరకు థియేటర్ల వద్ద సెక్యూరిటీగా పెట్టారు.
జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తన నాలుగవ భార్యగా పేర్కొన్నాడని మహిళా కమిషన్ దగ్గర కేసు పెట్టారు. అప్పట్లో మత్స్యకారులకు సంబంధించిన జీవోను వైసిపి ప్రభుత్వం జారీ చేస్తే.. దానిని చించివేశాడని కేసు నమోదు చేశారు. భీమ్లా నాయక్ సినిమాలో రావు రమేష్ పాత్ర జగన్మోహన్ రెడ్డిని పోలి ఉందని కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు విడుదల కాకుండా ఉండడానికి కేసులు పెట్టారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే.. ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని రకాలుగా కేసులు పెట్టి.. ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు ఇప్పుడు సుద్దపూసలుగా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా ఉందని.. జనసేన నాయకులు అంటున్నారు..
అన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతా అని ఆ మధ్య అన్నారు. దేనికోసం అన్నాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని జనసేన నాయకులు చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ నాయకులు ఆయన మీద కేసు పెట్టి జడ శ్రవణ్ లేదా రామ్ జెఠ్మాలనీ ని విచారణకు నియమించుకోవాలని జనసేన నాయకులు సూచిస్తున్నారు. అన్నట్టు వైసిపి నాయకులను ఆయన చెప్పుతో కొడతాను అని ఎందుకు అన్నారో కూడా చెప్పాలని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.

