spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Raja Reddy: రాహుల్ గాంధీ టీమ్ లో రాజారెడ్డి.. షర్మిల ప్లాన్ అదే!

YS Raja Reddy: రాహుల్ గాంధీ టీమ్ లో రాజారెడ్డి.. షర్మిల ప్లాన్ అదే!

YS Raja Reddy: అసలు వైయస్ షర్మిల ప్లాన్ ఏంటి? ఆమె కుమారుడు రాజారెడ్డి తెరపైకి రావడం వెనుక వ్యూహం ఏంటి? కుమారుడ్ని సహకారానికి తీసుకొచ్చారా? లేకుంటే తన బలం చాలదని భావిస్తున్నారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజకీయంగా సక్సెస్ ఉంటేనే తమ పిల్లలను ఆ రంగంలోకి తీసుకొస్తారు. కానీ ఇప్పుడు షర్మిలకు ఇంతవరకు ఎటువంటి పదవి దొరకలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ బలపడడం లేదు. ఇటువంటి స్థితిలో తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చారంటే.. కచ్చితంగా అది ఆలోచించదగ్గ విషయమే. రాజశేఖర్ రెడ్డి పిల్లలుగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అన్న కోసం షర్మిల గట్టిగానే కృషి చేసేవారు. చాలా అభిమానంతో గడిపేవారు. కానీ ఆస్తులు, కుటుంబ వ్యవహారాల పుణ్యమా అని వారి మధ్య చీలిక వచ్చింది. వ్యక్తిగత వివాదాల వరకు పరిస్థితి నడిచింది. అయితే ఉన్నట్టుండి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఆమె వెంట కనిపించడం.. రాజకీయ వేదికలపై కనిపిస్తుండడం మాత్రం కొత్త సంచలనాలకు దారితీస్తోంది.

Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?

* చివరికి కాంగ్రెస్ పార్టీలో..
తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు షర్మిల. సోదరుడు వైసిపి రూపంలో ఏపీలో అధికారంలో ఉండడంతో.. తెలంగాణలో తన తండ్రి పేరిట ఒక పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. అక్కడ పాదయాత్ర కూడా చేశారు. కానీ తెలంగాణ ప్రజలు ఆమెను గుర్తించలేదు. దీంతో లాభం లేదనుకొని తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను తీసుకున్నారు. అయితే గడిచిన ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. అయినా సరే కూటమికంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు షర్మిల. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకోవడం నిజంగా సంచలనమే. కచ్చితంగా దీని వెనుక వ్యూహం ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

* పతాక స్థాయికి ఆస్తి వివాదాలు..
ప్రస్తుతం సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదిస్తున్నారు. తన తండ్రి ద్వారా దఖలు పడిన ఆస్తిలో వాటా ఇవ్వాలని అడుగుతున్నారు. పైగా సరస్వతి పవర్ భూములలో తన వాటాలను కుమార్తెకు బదలాయించారు విజయమ్మ. దీంతో చెల్లి, తల్లిపై కోర్టులో కేసులు కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఈ వివాదాలు మరింత ముదిరాయి. మీరు కలుసుకోలేని విధంగా ఇబ్బందిగా పరిణమించాయి. అయితే కుటుంబ పరంగా తనకు ఇబ్బందులు పెడుతున్న సోదరుడు జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ తీయాలని షర్మిల భావిస్తున్నారు. అందుకు తాను ఒక్కదానినే సరిపోనని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా పొలిటికల్ సీన్ మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా కూటమి బల్పడే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కుమారుడు రాజారెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలపడితే తన కుమారుడిని సైతం.. భావి నాయకుడిగా ప్రాజెక్ట్ చేసుకోవాలని షర్మిల చూస్తున్నట్లు సమాచారం. అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని రాజారెడ్డి భావిస్తున్నారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిని దెబ్బతీయాలన్నది ఒక వ్యూహం కాగా.. రాహుల్ గాంధీ టీమ్ లో రాజారెడ్డిని పెట్టాలన్నది షర్మిల ఆలోచనగా తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper