YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఇప్పుడిప్పుడే గుణపాఠాలు నేర్చుకుంటోంది. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో అక్కడ సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా నాయకత్వ మార్పు పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ముందుగా తన సొంత జిల్లాపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కడప జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి చెక్ చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా అంజాద్ బాషా ఉన్నారు. ఆయన మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. రెండుసార్లు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆపై డిప్యూటీ సీఎం గా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి హవాకు బ్రేక్ వేయాలంటే కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు
* తప్పుతున్న పట్టు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కడప జిల్లా( Kadapa district) ఆ పార్టీకి ఆయువు పట్టు. 2014 ఎన్నికల్లో ఒక సాధారణ కార్పొరేటర్ గా ఉన్న అంజాద్ భాషాకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో సైతం రెండోసారి ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రెండోసారి కూడా అంజాద్ బాషా గెలిచారు. ఏకంగా జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకోవడమే కాదు డిప్యూటీ సీఎం హోదాను కూడా కట్టబెట్టారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అంజాద్ బాషా ఓడిపోయారు. ఆయన కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా.. రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి కలిసి వచ్చింది. అయితే ఏకంగా జిల్లా కేంద్రంలోని టిడిపి పాగా వేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇలానే కొనసాగితే కడప జిల్లాలో వైసిపి పట్టు కోల్పోవడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* యువ డాక్టర్ కు పగ్గాలు
కడప జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా( Amjad Basha ) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన సోదరుడితో పాటు కుటుంబ సభ్యుల వైఖరితో పార్టీకి నష్టం జరిగిందన్న అంచనాలు ఉన్నాయి. మరోసారి ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఈ క్రమంలో యువ డాక్టర్ సోహైల్ అహ్మద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన మాజీ మంత్రి, దివంగత నేత ఖలీల్ బాషా కుమారుడు. ఆయనకు ఇస్తే ఈజీగా విజయం సాధించవచ్చు అని జగన్మోహన్ రెడ్డికి సర్వే నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆది నుంచి వైసీపీ ఇక్కడ మైనారిటీలకు టికెట్లు ఇస్తూ వస్తోంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అంజాద్ బాషాను మార్చాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోహైల్ అహమ్మద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో ఈ యువ డాక్టర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఏకంగా ఓ మాజీ డిప్యూటీ సీఎం ను తప్పించి.. యువ డాక్టర్ కు అవకాశం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.