spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: ట్రాప్ లో వైసిపి.. పక్కా వ్యూహంతోనే చంద్రబాబు ఆ ప్రకటనలు!

CM Chandrababu: ట్రాప్ లో వైసిపి.. పక్కా వ్యూహంతోనే చంద్రబాబు ఆ ప్రకటనలు!

CM Chandrababu: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చంద్రబాబు ఎందుకు చెబుతున్నట్టు? క్లిష్ట పరిస్థితుల్లో పథకాలు అమలు చేయలేమని అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నట్టు? దీని వెనుక వ్యూహం ఉందా? లేకుంటే వైసీపీని ఇరికించే ప్రయత్నమా? మరి లేకుంటే ట్రాప్ చేస్తున్నట్టా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. వాటికి మించి కొన్ని రకాల హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు అమలు చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా సంక్షేమ పథకాల విషయంలో ఆశించిన స్థాయిలో అడుగులు వేయలేకపోతున్నారు. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసిపి దారుణంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనినే వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారని పోస్టులు పెడుతోంది. అయితే ఈ క్రమంలో వైసిపి చంద్రబాబు ట్రాప్ లో పడినట్లు తెలుస్తోంది. పథకాలు అమలు చేయకపోవడంపై విస్తృత ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో కొన్ని పథకాలను అమలు చేసి వైసిపిని ఇరుకున పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే అది తెలియని వైసీపీశ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే చంద్రబాబు పథకాలు అమలు చేయకపోవడం కంటే.. వైసిపి హయాంలో ఆర్థిక పరిస్థితి దిగజారింది అన్న అంశమే ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది తప్పకుండా మైనస్ చేస్తుందని.. చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ ను అర్థం చేసుకుంటే వైసీపీకే నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* పింఛన్ల విషయంలో
సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేయగలిగారు చంద్రబాబు. వృద్ధాప్య వితంతు పింఛన్ ను 3000 నుంచి 4 వేల రూపాయలకు పెంచగలిగారు. దివ్యాంగులకు సంబంధించి 6 వేలకు పెంచారు. అనారోగ్యం గురైన వారు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సైతం పింఛన్ అమాంతం పెంచి అందించగలిగారు. వైసిపి రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చినా తాను అమలు చేసిన విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. వరుసగా రెండో నెల సైతం పింఛన్లు విజయవంతంగా అందించి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసుకోగలిగారు.

*:అన్న క్యాంటీన్లను తెరిచే క్రమంలో
రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కచ్చితంగా ఆగస్టు 15 నాటి నుంచి అన్న క్యాంటీన్లలో భోజనాలు, అల్పాహారాలు ప్రారంభం కానున్నాయి. దీనిని కూడా ప్రచారాస్త్రంగా మార్చుకోనున్నారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా తాను అమలు చేసి చూపించానని చంద్రబాబు చెప్పుకొనున్నారు.

* ఉచిత ప్రయాణం మాటున
ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం ప్రారంభించేందుకు కసరత్తు పూర్తయింది. ప్రతినెల 250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఆధార్ కార్డుతో ప్రయాణానికి వీలు కల్పించాలా? లేకుంటే ప్రత్యేక కార్డులు జారీ చేయాలా? అన్నది నిర్ణయించనున్నారు. దీనిని సైతం చంద్రబాబు ప్రచారానికి వాడుకునే అవకాశం ఉంది. జగన్ ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినా.. ఈ రాష్ట్ర ప్రజల కోసం తాను ఈ పథకాలను అమలు చేస్తున్నానని చెప్పుకునే అవకాశం ఉంది. ఇది తెలియని వైసిపి.. చంద్రబాబు పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేయడం ద్వారా.. చంద్రబాబు ట్రాప్ లో పడినట్లు అయింది. దీనిని వైసిపి ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper
Exit mobile version