Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Sharmila Rakhi: షర్మిల జగన్ కు రాఖీ కడతారా ?

YS Jagan Sharmila Rakhi: షర్మిల జగన్ కు రాఖీ కడతారా ?

YS Jagan Sharmila Rakhi: సోదర బంధానికి ప్రతీక రక్షాబంధన్( Raksha Bandhan ). ఎంత దూరంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. రక్షాబంధన్ నాడు సోదరి, సోదరులు కలుసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. రాఖీ కట్టి నిండు మనసుతో సోదరుడిని ఆశీర్వదించడం.. సోదరిని దీవించడం చేస్తుంటారు. ఒకరి హితం కోసం మరొకరు కోరుకుంటారు. ఇంతటి రక్షాబంధన్ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. తమ శక్తి కొలది ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే రక్షాబంధన్ వచ్చిందంటే చాలు అందరి చూపు ప్రముఖులపై ఉంటుంది. సెలబ్రిటీల వైపు ఎక్కువ మంది చూస్తారు. వివిధ కారణాలతో వివాదాల్లో చిక్కుకున్న వారి వైపు ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు ఏపీలో అందరి చూపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి, పిసిసి చీఫ్ వైయస్ షర్మిలపై ఉంది. కానీ వారిద్దరికీ సంబంధించి రక్షాబంధన్ అప్డేట్ ఏవి బయటకు రాకపోవడం విశేషం.

Also Read: చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?

కుటుంబంలో కొరవడిన ఐక్యత..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) కుటుంబం ఐక్యతకు మారుపేరు. చిన్నపాటి వేడుకనైనా ఘనంగా జరుపుకుంటుంది ఆ కుటుంబం. అటువంటిది గత కొద్ది రోజులుగా ఆ కుటుంబంలో వేడుకలు జరుగుతున్నాయి. కానీ ఐక్యత మాత్రం కనిపించడం లేదు. వివేకానంద రెడ్డి హత్యతో ఆ కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. కుటుంబంలో ఆర్థిక చిచ్చురావడంతో సోదరుడు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు షర్మిల. అలా క్రమేపి వారి మధ్య దూరం రాజకీయ వైరం గా మారిపోయింది. పిల్లలిద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో సతమతం అవుతున్నారు విజయమ్మ. కానీ షర్మిల వైపు కొద్దిపాటి మొగ్గు చూపిస్తున్నారు. అయితే క్రమేపి పిల్లలిద్దరి మధ్య అగాధం పెరిగిపోయింది. రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

Also Read: విశాఖ టు భోగాపురం.. నాలుగు టౌన్ షిప్ లు.. ఎన్ని ఉద్యోగాలో తెలుసా?

ఎటువంటి ప్రకటన లేదు..
రాష్ట్రంలో సోదరీమణులందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కానీ తన సోదరి షర్మిల( Y S Sharmila) ఆయనకు రాఖీ కట్టకపోవడం విశేషం. వారి మధ్య పండుగలు, వివాహాలు, కుటుంబ వేడుకలు సైతం నిలిచిపోయాయి. షర్మిల కుమారుడి వివాహానికి సైతం జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాల తరువాత, ప్రస్తుతం సైతం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు షర్మిల. రోజురోజుకు వారి మధ్య బంధం దూరమవుతూ వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రక్షాబంధన్ నాడు వారిద్దరూ కలవడం అనేది జరగని పని అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి షర్మిల రాఖీ కట్టారని కానీ.. శుభాకాంక్షలు తెలిపారని కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఈ ఏడాది రక్షాబంధన్ కూడా వైయస్సార్ కుటుంబాలకు నిరాశనే మిగిల్చింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper
Exit mobile version