ఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఈసారైనా బిజెపి పవన్ కు క్లారిటీ ఇస్తుందా?

Pawan Kalyan: ఈసారైనా బిజెపి పవన్ కు క్లారిటీ ఇస్తుందా?

Pawan Kalyan: ఏపీ విషయంలో బిజెపి ప్లాన్ ఏంటి? తెలుగుదేశం, జనసేనతో కలిసి వెళ్తుందా? ఒంటరి పోరాటం చేస్తుందా? అన్నది క్లారిటీ లేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే రకమైన ప్రశ్న. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదు. అటు ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉన్న పవన్ బిజెపి తప్పకుండా తమ వెంట వస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి కేంద్ర మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలవనున్నట్లు తెలుస్తోంది. వారి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఈసారైనా క్లారిటీ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.

ఎన్డీఏ లో జనసేన భాగస్వామ్య పక్షం. అయితే జనసేన అధినేత పవన్ టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు. ఈ కూటమిలోకి బిజెపి వస్తుందని చెబుతున్నారు. నేను ఒప్పిస్తానని.. టిడిపి, బిజెపిని కలుపుతానని ఇన్నాళ్లు చెప్పుకొస్తూ వచ్చారు. కలుస్తాది అనుకుంటున్న బిజెపి నోరు విప్పడం లేదు. కలుపుకొని వెళ్లాలనుకుంటున్న టిడిపి సైలెంట్ గా ఉంది. కానీ పవన్ మాత్రం ఆ రెండు పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అది మాత్రం కొలిక్కి రావడం లేదు. బిజెపి ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. రాష్ట్ర బిజెపి నాయకులు ఒంటరిగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేయలేదు. హై కమాండ్ మాత్రం పొత్తుకు మొగ్గుచూపడం లేదు. పవన్ కు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయేది బిజెపియే. ఇప్పటివరకు ఎదిగే ప్రక్రియ ఒక్కటీ ఆ పార్టీకి కలిసి రాలేదు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజెపితో పవన్ స్నేహం చేశారు. బిజెపి, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతాయని ప్రకటించారు. కానీ అలా వెళ్లిన దాఖలాలు లేవు. ఉమ్మడి కార్యాచరణ అంతకంటే లేదు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ అయ్యేసరికి నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చిన తర్వాత పవన్ పొత్తును ప్రకటించారు. అంతకంటే ముందుగానే చంద్రబాబుతో పలుమార్లు సమావేశమయ్యారు. భాగస్తులైన బిజెపితో ఆతరహా సమావేశం ఒక్కటీ జరగలేదు. మాతో భాగస్వామ్య పార్టీ అయి ఉండి.. టిడిపి తో పొత్తు ఎలా పెట్టుకుంటారని పవన్ ను బిజెపి ప్రశ్నించలేదు. టిడిపి తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పడం లేదు. అలాగని టిడిపి ముందుకెళ్లి బిజెపికి స్నేహ హస్తం అందించడం లేదు. కానీ ఆ రెండు పార్టీలను కలిపే బాధ్యతలను పవన్ తీసుకున్నారు. ఈ తరుణంలో ఒక రకమైన అయోమయం నెలకొంది. దీనికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బిజెపి పైనే ఉంది. పొత్తు ఉంటే ఉంటుందని ప్రకటన చేయాలి. లేకుంటే ఒంటరి పోరు ఉంటుందని తేల్చి చెప్పాలి. అలా చెప్పకపోతే మాత్రం ఒక జాతీయ పార్టీగా మూల్యం చెల్లించుకునేది బిజెపియే. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చి బిజెపి దారుణంగా దెబ్బతింది. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే పొత్తు అయినా పెట్టుకోవాలి. ఒంటరి పోరుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకే ఈసారైనా పవన్ పర్యటనతో ఈ విషయంలో క్లారిటీ వస్తుందో? లేదో? చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version