Homeఆంధ్రప్రదేశ్‌Diversionary politics in AP: ఏపీలో డైవర్షన్ పాలి'ట్రిక్స్' ఎవరివి?

Diversionary politics in AP: ఏపీలో డైవర్షన్ పాలి’ట్రిక్స్’ ఎవరివి?

Diversionary politics in AP: ఇటీవల డైవర్షన్ పాలిటిక్స్( diversion politics) అనే మాట ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు, పాలనా వైఫల్యాలు బయటపడినప్పుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నది ఒక వాదన. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే మాట వినిపిస్తోంది. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తరహా విమర్శలు చేసేది. ఇప్పుడు అవే విమర్శలు వైసీపీ నేతలు చేస్తుండడంతో డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి అనే చర్చ ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కూటమి ప్రభుత్వానికి అంత అవసరం ఏమి వచ్చిందన్నది ఒక వాదన. దానికి వైసీపీ నుంచి వస్తున్న కారణాలు.. కాశీబుగ్గ తొక్కిసలాట, తుఫాన్ అని చెబుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే ఈ తరహా ఆరోపణలు చేశారు.

ప్రైవేటు ఆలయంలో ఘటన..
కాశీబుగ్గ( Kashi Bugga) ఆలయ తొక్కిసలాట ఘటన ప్రభుత్వ వైఫల్యంగా చెబుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. భక్తులు భారీగా తరలి వస్తారని తెలిసి పోలీస్ శాఖ నిర్లక్ష్యం చేసింది అన్నది వైసిపి ఆరోపణ. అయితే అది ప్రముఖ దేవస్థానం కాదు. దేవాదాయ శాఖ పరిధిలో లేదు. ఆ శాఖ అధికారుల పర్యవేక్షణలో లేదు. ఆపై నిర్వాహకులు సైతం తాము పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. అంత మంది భక్తులు వస్తారని కూడా అంచనా వేయలేకపోయామని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించింది. ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించింది. క్షతగాత్రులతోపాటు తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. మంత్రి నారా లోకేష్ నుంచి మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వరకు అంత శ్రీకాకుళం వచ్చారు. ఆ జిల్లా మంత్రులతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అలాంటప్పుడు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి అరెస్ట్ జరగడం అని వైసిపి చెప్పడం ఎంతవరకు కరెక్ట్.

ముందే మేల్కొన్న ప్రభుత్వం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అది తీవ్ర వాయుగుండంగా, తీవ్ర తుఫానుగా మారి ఏపీ తీరంపై విరుచుకుపడుతుందని హెచ్చరించింది. అది మొదలు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలను అప్రమత్తం చేసింది. ముందస్తు హెచ్చరికలు పంపింది. తుఫాను ముందస్తు చర్యలు చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన పనులు కోసం కోటి రూపాయల చొప్పున ప్రతి జిల్లాకు కేటాయించింది. అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ సచివాలయంలోనే గడిపారు. మంత్రి లోకేష్ అయితే రాత్రంతా సచివాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తుఫాను సహాయ చర్యల్లో సైతం ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించింది. నిత్యవసరాలను పంపిణీ చేసింది. పంట నష్టం నివేదికను తయారు చేసింది. పరిహారం కూడా అందించేందుకు ప్రకటన చేసింది. కానీ తుఫాను సహాయ చర్యల్లో ప్రభుత్వం వెనుకబడిపోయిందని.. అందుకే జోగి రమేష్ అరెస్టు జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఆ వాదన సహితుకమేనా?
విపత్తులతో పాటు ప్రమాదాలు చెప్పి రావు. అవి సహజం కూడా. అయితే ఇప్పుడు ఈ రెండు విపత్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమయిందని.. అందుకే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు జరిగిందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం విశేషం. అధినేత జగన్మోహన్ రెడ్డి తుఫాను బాధితులను పరామర్శించలేదు. అంతెందుకు ప్రభుత్వ విధానాలపై వైసీపీ పోరాటాలు, ఆందోళనలు చేసిన సమయంలో అరెస్టు చేసి ఉంటే దానిని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. కానీ విపత్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చక్కగానే పనిచేస్తుంది. ఇటువంటి సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వానికి అవసరమా? అన్నది ప్రశ్న. కానీ ఇప్పుడు వైసీపీ లేనిపోని అంశాలపై పోరాడుతుందే తప్ప.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడం లేదన్నది హైలెట్ అవుతోంది. అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper