Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా.. పోతూ పోతూ జగన్ పై కామెంట్స్ వైరల్*

Vijayasai Reddy: వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా.. పోతూ పోతూ జగన్ పై కామెంట్స్ వైరల్*

Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వైసీపీకి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. తాజాగా వైసిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2029 ఎన్నికలు, ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకొచ్చారు. శత్రుత్వం,అపార్థాలకు తావు లేకుండా వ్యవసాయం చేసుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు ఇటీవల ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఆ మరునాడే అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ ను కలవడం, రాజీనామా లేఖ సమర్పించడం, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకు రావడంతో చైర్మన్ దానిని ఆమోదించారు.

* సుదీర్ఘ రాజీనామా లేఖ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ఈ ప్రకటన చేసినప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నారు. నిన్ననే ఆయన విదేశాల నుంచి బెంగళూరు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతకు తన రాజీనామాకు సంబంధించిన లేఖను పంపించారు. 2029 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు విజయసాయిరెడ్డి. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకనుంచి వ్యవసాయ ప్రపంచంలోనే ఉండాలని భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.

* విదేశీ పర్యటనకు ఏర్పాట్లు
మరోవైపు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు( foreign tour) వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతులు ఇస్తూ సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. ఆయన ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నార్వే వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు. కానీ సిబిఐ అభ్యంతరాల మేరకు కోర్టు అనుమతి ఇస్తుందా? లేదా? అని అంత ఆలోచించారు. అయితే విజయ్ సాయి రెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఐదు లక్షల రూపాయల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే విజయసాయిరెడ్డి 30 రోజుల పాటు విదేశీ పర్యటనకు అనుమతి కోరితే కోర్టు మాత్రం 15 రోజులకి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్య 15 రోజులు విదేశాల్లో పర్యటించేందుకు ఆయనకు అనుమతి లభించింది.

* 3న తాడేపల్లి కి జగన్
ఇంకోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)ఈనెల మూడున తాడేపల్లికి రానున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో.. జగన్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. అయితే పార్టీ ముఖ్య లతో జగన్ బెంగళూరులో సమావేశం అవుతారని.. విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణమైన అంశాల గురించి పార్టీ ముఖ్యులకు జగన్ వివరించి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి ఆడుతున్న గేమ్లో భాగంగానే ఇదంతా జరుగుతోందని.. కూటమి పార్టీల మధ్య పక్క ఒప్పందం జరిగిందని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన ఇస్తారో అని పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version