Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy Liquor Scam: మద్యం స్కామ్ కేసులో అన్నంతపని చేసిన విజయసాయిరెడ్డి!

Vijayasai Reddy Liquor Scam: మద్యం స్కామ్ కేసులో అన్నంతపని చేసిన విజయసాయిరెడ్డి!

Vijayasai Reddy Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఈడి అధికారులు తనిఖీలు చేశారు. మద్యం కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి, ఆయనకు సహకరించిన ఇతర నిందితుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని ఏక్తా హైలాండ్ అపార్ట్మెంట్ లో ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసంలో ఈడి బృందాలు లోతుగా తనిఖీలు చేపట్టాయి. మొన్ననే విజయసాయిరెడ్డి ఏడు గంటల పాటు విచారణ సాగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో. ఆయన ఇచ్చిన సమాచారంతోనే ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒక్క రాజ్ కసిరెడ్డి మాత్రమే కాదు.. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎంపీ వాసుదేవ రెడ్డి నివాసంతో పాటు కోకాపేటలోని ఆయన బంధువుల ఇళ్లు, ఆ సిండికేట్ లో మధ్యవర్తులుగా వ్యవహరించిన వల్లు సందీప్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వంటి మొత్తం ఆరుగురు నిందితుల ఆస్తులపై దాడులు జరిగాయి.

* వైసిపి హయాంలో భారీ కుంభకోణం..
వైసిపి ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో సుమారు రూ.3500 కోట్ల పక్కదారి పట్టిందన్న ఆరోపణలు పై.. ఇప్పటికే ఈడి రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గతంలో కూడా ఈడి పలుమార్లు విస్తృత సోదాలు జరిపింది. విజయసాయిరెడ్డిని ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. అయితే తనకు ఈ స్కాంతో ఎలాంటి సంబంధాలు లేవని.. ఈ కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తోనే ఇప్పుడు ఈడి రంగంలోకి దిగింది. విస్తృత తనిఖీలు చేపట్టింది.

* సమాంతరంగా విచారణలు..
మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పిఎ నాగేశ్వర్ రెడ్డి ఇంట్లో కూడా భారీగా ఆస్తుల దృవపత్రాలతో పాటు అక్రమ నగదును గుర్తించింది. అయితే దానికి సమాంతరంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఒకవైపు ఏపీ దర్యాప్తు సంస్థ.. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ ఏకకాలంలో విచారణ చేపడుతున్నాయి మద్యం కుంభకోణం కేసులో. అయితే విచారణ జరుగుతున్న కొలది అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా ఓ కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణానికి అవసరం అయిన సమాచారం ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. అటు తరువాతనే మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పుడు రెండోసారి ఈ డి విచారణతో నిందితుల ఇళ్లపై దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రముఖంగా నిలుస్తుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version