ఆంధ్రప్రదేశ్‌Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. వారు దయతలిస్తేనే!

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. వారు దయతలిస్తేనే!

Vallabhaneni Vamsi : ఏపీలో( Andhra Pradesh) కూటమి దూకుడు మీద ఉంది. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో దూకుడుగా వ్యవహరించిన నేతలను టార్గెట్ చేసుకుంది. అందులో కొందరు జైలు జీవితం అనుభవించారు కూడా. మరికొందరు మాత్రం న్యాయస్థానాల ద్వారా ఉపశమనం పొందుతున్నారు. అయితే వల్లభనేని వంశీ మోహన్, పోసాని కృష్ణ మురళి లాంటి నేతలు మాత్రం తప్పించుకోలేకపోయారు. పోసాని కృష్ణ మురళి సుమారు 26 రోజులపాటు రిమాండ్ లో ఉండిపోయారు. వల్లభనేని వంశీ మోహన్ కు ఇప్పట్లో విముక్తి లభించే అవకాశం కనిపించడం లేదు. అందరికంటే ముందు అరెస్టయ్యారు బోరుగడ్డ అనిల్ కుమార్. మధ్యలో ఓసారి బెయిల్ పై విడుదలై మళ్లీ జైల్లోకి వచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోసానికి బెయిల్ దక్కింది. కానీ వల్లభనేని వంశీ మోహన్ కు వచ్చినట్టే వచ్చి బెయిల్ దక్కకుండా పోతోంది. ఇప్పట్లో ఆయనకు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదు.

Also Read : సజ్జల ఔట్.. ఆయన స్థానంలో కొత్త నేతకు జగన్ అవకాశం!

*టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం ( Telugu Desam) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ మోహన్. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు. 2019లో సైతం రెండోసారి టిడిపి తరఫున విజయం సాధించారు. అయితే అక్కడకు కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అది మొదలు చంద్రబాబు కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. ఒకానొక దశలో వారి కుటుంబ సభ్యులకు కూడా వల్లభనేని చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఇప్పుడు కేసుల రూపంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉండి పోవాల్సిన పరిస్థితి వల్లభనేని వంశీ మోహన్ పై ఏర్పడింది. అయితే ఇప్పట్లో ఆయనకు కోర్టుల్లో ఉపశమనం దక్కే అవకాశం లేదు. దీనిపై ఆయన అభిమానుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. టిడిపి సోషల్ మీడియా మాత్రం సెటైరికల్ గా కామెంట్లు పెడుతోంది.

* రెండు కేసుల్లో బెయిల్
తాజాగా ఓ రెండు కేసుల్లో వల్లభనేని వంశీ మోహన్ కు( Vallabha Neni Vamsi Mohan) ఉపశమనం దక్కింది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో ఆయన విడుదల తప్పదని భావించారు అభిమానులు. కానీ కిడ్నాప్ తో పాటు కార్యాలయం పై దాడి విషయంలో మాత్రం ఆయనకు బెయిల్ లభించడం లేదు. భూ కబ్జా కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది. కానీ ఓ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఇప్పట్లో వంశీ విడుదల ఉండదని తేలిపోయింది. దీనిపైనే రకరకాల చర్చ నడుస్తోంది. మరోవైపు వంశి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని న్యాయస్థానాన్ని కుటుంబ సభ్యులు ఆశ్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

* టిడిపి హై కమాండ్ దయతలిస్తేనే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి( Telugu Desam) హై కమాండ్ దయతలిస్తేనే వల్లభనేని వంశీ మోహన్ బయటకు వచ్చేది. లేకుంటే మాత్రం మరి కొంతకాలం జైలు జీవితం తప్పదు. అయితే అప్పట్లో వల్లభనేని వంశీ మోహన్ చేసిన కామెంట్స్ పై ఇప్పటికీ టిడిపి శ్రేణులు మండిపడుతూనే ఉంటాయి. నాటి కామెంట్స్ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ ట్రోల్ చేస్తుంటాయి. మరి కొంతకాలం ఆగితే గాని టిడిపి హై కమాండ్ వల్లభనేని వంశీ మోహన్ పై దయతలిచే అవకాశం లేదని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. గతంలో కూడా వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్యం పై రకరకాల ప్రచారం నడుస్తూ వచ్చింది. ఆయనకు అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది.

Also Read : ఏపీ తీరాన్ని కరెక్ట్ గా వాడుకుంటున్న చంద్రబాబు!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version