Homeఆంధ్రప్రదేశ్‌Temperature: దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఏపీలో.. ఆ జిల్లాలో రికార్డు స్థాయిలో

Temperature: దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఏపీలో.. ఆ జిల్లాలో రికార్డు స్థాయిలో

Temperature: ఈ ఏడాది ఎండలు దంచి కొట్టేలా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు( temperature) అమాంతం పెరిగాయి. వేసవి ప్రారంభంలోనే ప్రతాపం చూపుతున్నాయి. సంక్రాంతి తరువాత ఎండలు పెరుగుతూ వచ్చాయి. ఫిబ్రవరి రెండో వారానికి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రతో పాటు మన్యంలో విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు కురుస్తూనే ఉంది. ఇంకోవైపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

* కర్నూలులో ఏకంగా 37.8 డిగ్రీలు
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత మన రాష్ట్రంలోని కర్నూలులో ( Kurnool)నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా అక్కడ పగటి ఉష్ణోగ్రత 37.8 గా నమోదు కావడం విశేషం. బుధవారం ఒక్కసారిగా ఎండలు మండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ కంటే నాలుగు డిగ్రీలు పెరిగాయి. కానీ కర్నూలు విషయంలో మాత్రం ఒకేసారి ఉష్ణోగ్రతలు భగ్గుమన్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. ఫిబ్రవరి రెండో వారంలోనే ఇలా ఉంటే.. వేసవిలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో ప్రజల్లో ఒక రకమైన భయం వాతావరణం కనిపిస్తోంది.

* వాతావరణం లో విచిత్రం
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతూనే ఉంది. అటు తరువాత సూర్యుడు(sun )ప్రతాపం చూపడం ప్రారంభిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు భానుడు భగభగతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. మరోవైపు శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. శివరాత్రి నుంచి మరింత ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

* ఈ ఏడాది రికార్డు స్థాయిలో
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు( heat ) ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తోంది. దశాబ్ద కాలం పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని.. 2015 నుంచి 2025 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టమైన సూచనలు చేసింది. ఈ తరుణంలో ఈ ఏడాది ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. మున్ముందు వేసవిలో ఏ పరిస్థితి ఉంటుందోనన్న ఆందోళన అందరిలో కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version