Homeఆంధ్రప్రదేశ్‌TDP And Janasena Alliance: 'తూర్పు'లో పొత్తుల కత్తులు!

TDP And Janasena Alliance: ‘తూర్పు’లో పొత్తుల కత్తులు!

TDP And Janasena Alliance: ఉమ్మడి ఏపీ నుంచి ఒక సెంటిమెంట్ నడుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించే పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు ఈ జిల్లాలపై దృష్టి పెడతాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. అయితే టిడిపి, జనసేన కూటమి ఇక్కడ ఏకపక్ష విజయం దక్కించుకుంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆ రెండు పార్టీల ఆశావాహులు ఇక్కడ అధికం. దీంతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెజారిటీ సీట్లను జనసేన ఆశిస్తుండడంతో.. టిడిపి నేతలు బెంబేలెత్తిపోతున్నారు.

2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 14 శాతం ఓట్లను సాధించింది. ఇదే జిల్లాలోని రాజోలు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. అందుకే ఈసారి మెజారిటీ సీట్లను ఆశిస్తోంది. 6 నుంచి 8 వరకు ఎమ్మెల్యే స్థానాలను జనసేనకు కేటాయించాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజోలు, రాజానగరం పై పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు. వీటికి తోడు కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రి రూరల్, ముమ్మిడివరం సీట్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తపేట, రామచంద్రపురం వంటి స్థానాల్లోనూ జనసేన పార్టీ ఆశావహులు పనిచేసుకుంటూ పోతున్నారు.

అయితే జనసేన ఆశిస్తున్న నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన నేతలు ఉన్నారు. వారికి ఎలా సముదాయిస్తారు? ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన ఆ స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయనకు కాదని జనసేనకు టికెట్ కేటాయిస్తే రెబల్ గా మారి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఉన్నారు. ఆ సీటును సైతం జనసేన ఆశిస్తుండడంతో బుచ్చిబాబు పరిస్థితి ఏమిటి అన్నది తెలియడం లేదు. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పొత్తుల అంశం రెండు పార్టీల మధ్య సంక్లిష్టత ఉంది. దీనిపై పవన్, చంద్రబాబు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో చూడాలి. ఇప్పటికే పవన్ కాకినాడలో వరుసగా సమీక్షలు చేశారు. మెజారిటీ నియోజకవర్గాల విషయంలో ఒక స్పష్టతకు వచ్చారు. చంద్రబాబుతో తుది ఆలోచన చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అప్పటివరకు రెండు పార్టీల నేతలకు టెన్షన్ తప్పదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version