spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Mahakumbh Mela  : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్ అవే!

Mahakumbh Mela  : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్ అవే!

Mahakumbh Mela  : మహా కుంభమేళ( Mahakumbh Mela ) 2025 ఘనంగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు పండగ వాతావరణం నెలకొంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని లక్షలాదిమంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు వివిధ మార్గాల్లో ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సైతం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

* మహా కుంభమేళాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. వాటి రాకపోకలకు సంబంధించి తేదీలను కూడా ప్రకటించింది. గుంటూరు, విజయవాడ,కాకినాడ టౌన్, మచిలీపట్నం నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా వేరువేరు నగరాలకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. గుంటూరు నుంచి అజంగఢ్ వెళ్లే రైలు ఈనెల 24న శుక్రవారం రాత్రి 11 గంటలకు గుంటూరులో బయలుదేరనుంది. ఆదివారం సాయంత్రం 5:15 గంటలకు ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ చేరుకొనుంది. 26 మంగళవారం సాయంత్రం 7:45 గంటలకు అజంగఢ్ నుంచి రైలు బయలుదేరుతుంది. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
* గుంటూరు నుంచి గయాకు ప్రత్యేక రైలు నడవనుంది. 25 శనివారం మధ్యాహ్నం రెండు 20 గంటలకు గుంటూరులో బయలుదేరుతుంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు గయా కు చేరుకుంటుంది. 27న సోమవారం మధ్యాహ్నం రెండు 15 గంటలకు గయా నుంచి బయలుదేరే ట్రైన్.. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
* మచిలీపట్నం అజంగఢ్ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 5న బుధవారం రాత్రి 10 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరుతుంది. శుక్రవారం సాయంత్రం 5:15 గంటలకు అజంగఢ్ చేరుకుంటుంది. శుక్రవారం సాయంత్రం 7:45 గంటలకు అజంగఢ్ నుంచి బయలుదేరి ట్రైన్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
* కాకినాడ టౌన్ నుంచి అజంగఢ్ వెళ్లే ట్రైన్ ఫిబ్రవరి 20 రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్ లో బయలుదేరుతుంది. ఫిబ్రవరి 22న అజంగఢ్ చేరుకుంటుంది. 22 అజంగఢ్ నుంచి బయలుదేరే ట్రైన్ 24 న ఉదయం 7:30 గంటలకు విజయవాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version