spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Delhi Tour: ముందు మర్యాదలు.. తర్వాత చర్చలు.. ఆపై నిర్ణయాలు.. ఇదీ బాబు స్టైల్!...

Chandrababu Delhi Tour: ముందు మర్యాదలు.. తర్వాత చర్చలు.. ఆపై నిర్ణయాలు.. ఇదీ బాబు స్టైల్! అప్పటికి ఇప్పటికీ చాలా తేడా..

Chandrababu Delhi Tour: మనదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు తమ రాష్ట్రాలకు కావలసిన వాటిని కేంద్రం వద్ద పోరు పెట్టి మరి తెచ్చుకుంటారు. మరికొందరేమో కేంద్రం వద్ద చేతులు కట్టుకొని ఎందుకు ఉండాలని.. తమలో తామే సర్దుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మొదట్లో కేంద్రంతో సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గాని.. కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు డుమ్మా కొట్టారు. చివరికి ప్రధాని వచ్చిన కలవకుండా ముఖం చాటేశారు.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి దాకా ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్ కేసీఆర్ వ్యవహరించకపోయినప్పటికీ.. రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవడంలో పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదని విమర్శలు ఉన్నాయి. ప్రధానమంత్రిని, హోం మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని, ఇతర మంత్రులతో మర్యాదగా భేటీ కావడం.. వారికి వినతి పత్రాలు సమర్పించడం.. జ్ఞాపికలు అందించడంతోనే సరిపుచ్చేవారు. ఆ తర్వాత ఫాలో అప్ అనేది ఉండేది కాదు. ఫలితంగా ఏపీకి పెద్దగా కేంద్రం నుంచి సాయం అందేది కాదనే విమర్శలు ఉన్నాయి. అటు జగన్, ఇటు కేసీఆర్ కంటే చంద్రబాబుది డిఫరెంట్ స్టైల్. పైగా ఆయన ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతానికంటే భిన్నంగా ఇప్పుడు ఆయనకు కేంద్రంలో పలుకుబడి పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే నాటి వాజ్ పాయ్ ప్రభుత్వంలో చంద్రబాబు ఎలాంటి పాత్ర పోషించారో.. ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనూ అలాంటి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

స్టైల్ వేరు

సాధారణంగా చంద్రబాబు గ్రీవెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. గంటల కొద్దీ సమీక్షలు ఉంటాయి. నిర్ణయాలు ఆలస్యంగా తీసుకున్నప్పటికీ.. అవి చాలా పకడ్బందీగా ఉంటాయి. అందువల్లే చంద్రబాబుతో పని చేసిన చాలామంది అధికారులు తమ అనుభవాలను వివిధ వేదికల వద్ద పంచుకున్నారు.. చంద్రబాబుతో పనిచేయడం ఒక ముఖ్యమంత్రితో చేసినట్టు ఉండదని.. ఒక కార్పొరేట్ కంపెనీ సీఈవోతో పనిచేసినట్టు ఉంటుందని పేర్కొన్నారు. నిజానికి చంద్రబాబు వర్కింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. కార్పొరేట్ సెక్టార్లో మర్యాదకు ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత చర్చలు మొదలు పెడతారు. చివరికి తమకు కావాల్సింది సమకూర్చుకుంటారు. సేమ్ అలాగే చంద్రబాబు విధానం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముందుగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఏపీకి సంబంధించిన పలు సమస్యలను ఆయన ఎదుట ప్రస్తావించారు. ఇదే సమయంలో తిరుమల లడ్డును అందించారు.. ఈ లడ్డు కల్తీ నెయ్యితో తయారుచేసింది కాదని.. స్వచ్ఛమైన నెయ్యితో రూపొందించిందని చమత్కరించారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు.. రావలసిన నిధుల గురించి చర్చించారు. అనంతరం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, హార్దిప్ పూరి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో వరుసగా భేటీ అయ్యారు. ముందుగా వారికి ఏపీ ప్రభుత్వం తరఫున జ్ఞాపికలు అందించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను ఇచ్చారు. ఆ తర్వాత పలు విషయాలపై చర్చించారు. అనంతరం వివిధ అధికారులతో ఫోన్లో మాట్లాడి.. ఏపీకి కావలసిన వాటిని మరొకసారి చర్చించారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోదు. ఆ తర్వాత నిరంతరం ఫాలో అప్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అందువల్లే గత కొద్దిరోజులుగా ఏపీకి కేంద్రం నుంచి నిధుల వరద కొనసాగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ.. బీహార్ రాష్ట్రంతో పోల్చితే ఏపీ రాష్ట్రానికి వస్తున్న నిధులు చాలా ఎక్కువ. ఇటీవల బడ్జెట్లో కేంద్రం అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేసింది.. ఇక భవిష్యత్తులోనూ మరిన్ని నిధులు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, బిపిసిఎల్ రిఫైనరీ, విజయవాడ తూర్పు బైపాస్ అభివృద్ధి.. ఇంకా అనేక వరాలు ఆంధ్రకు త్వరలో లభించనున్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం అనుమతితో ఏపీకి రానున్నాయి.

స్థూలంగా చెప్పాలంటే రాజకీయాలు ఒక పట్లగా లేవు. రాజకీయాలు ఎలా మారుతాయో తెలియదు. ఎన్నికైన ప్రజల నమ్మకాన్ని చురగొనాలంటే.. పథకాలు ఒకటి మాత్రమే పరిష్కారం కాదు. శాశ్వత అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన.. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం.. ప్రజల సమస్యలు పరిష్కరించడం.. ఇవన్నీ ఒక రోజులో పూర్తికావు. కానీ దశలవారీగా చేపడితేనే వీటన్నింటికీ మోక్షం లభిస్తుంది. అలా జరగాలంటే పాలకుడు ప్రజల క్షేమం కోణంలో పని చేయాలి. అన్నింటికీ మించి కేంద్రంతో సయోధ్య కుదుర్చుకోవాలి. ఉభయకుశలోపరి అనే ముద్రను తుదికంటా పాటించాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper