spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vegetable Prices: ఏపీలో కూర‘గాయాల’ మంట.. ఆంధ్రజ్యోతినే నిలదీసిందిగా.. బాబు సర్కార్ ఏం చేస్తుందో?

Vegetable Prices: ఏపీలో కూర‘గాయాల’ మంట.. ఆంధ్రజ్యోతినే నిలదీసిందిగా.. బాబు సర్కార్ ఏం చేస్తుందో?

Vegetable Prices: ఏపీలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వర్షాకాలంలో ధరల పెరుగుదల సహజమే అయినా.. గత ఐదు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ ప్రభుత్వం ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేదు. అదే పంట వినియోగదారుడు కొనుగోలు చేస్తే ధర ఎక్కువగా ఉంది. అంటే మధ్యలో దళారుల ప్రమేయం అధికం అయింది అన్నమాట. మార్కెట్ మాయతో ధరల మంట మండుతోందన్నమాట. గత నాలుగైదు నెలలుగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రైతు బజార్లతో పోల్చితే బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధర ఉంటోంది. పండించిన రైతుకు పది రూపాయలు దక్కుతుండగా.. బహిరంగ మార్కెట్లో వినియోగదారుడికి 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే రైతు కంటే దళారుల రూపంలో ప్రవేశిస్తున్న వ్యాపారులకు 20 రూపాయల లాభం దక్కుతుందన్నమాట. ప్రస్తుతం టమాటా ధర 100 రూపాయలకు ఎగబాకింది. ఉల్లి ధర 50 రూపాయల పై మాటే. ఇతరత్రా కూరగాయల ధరలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. మండువేసవితో పాటు వరదల సమయంలో కూరగాయల ధరలు పెరగడం సహజం. పంటలు దెబ్బ తినడమే ఇందుకు కారణం. ఆ తరువాత మళ్లీ ధరలు దిగివస్తాయి. కానీ రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. కిందికి దిగి రావడం లేదు. ప్రభుత్వానికి అత్యంత దగ్గరైనా, టిడిపి అనుకూల మీడియాగా ముద్రపడిన ఆంధ్రజ్యోతిలోనే కూరగాయల ధరలపై ఒక ప్రత్యేక కథనం వచ్చింది. అంటే ఏ స్థాయిలో ధరలు విసుగు పుట్టిస్తున్నాయో అర్థం అవుతోంది.

Vegetable Prices
Vegetable Prices

* ఎన్నికల ముందు హామీ
తాము అధికారంలోకి వస్తే నిత్యవసరాలతో పాటు కూరగాయల ధరల పెరుగుదలను నియంత్రిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఉల్లి, టమాట, బంగాళదుంపలు సర్వసాధారణంగా ప్రతి ఇంట ఉపయోగించడం అధికం. వంటల్లో వీటిదే కీలకపాత్ర. కానీ వీటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. పోనీ రైతుల వద్ద ఉన్న పంటకు గిట్టుబాటు లభిస్తుందా? అంటే అది ఉండడం లేదు. రైతులు వద్ద కొనుగోలు చేసిన ధర కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

* ధరలో ఎంతో తేడా
మదనపల్లె మార్కెట్ టమాటా వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడ 10 కిలోల టమాట 200 రూపాయల నుంచి 450 లకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. అంటే కిలో 25 రూపాయల నుంచి 40 రూపాయల వరకు దొరుకుతుందన్నమాట. బహిరంగ మార్కెట్లో కిలో టమాట ధర 100 రూపాయల వరకు ఎగబాకింది. అంటే దళారులు వ్యాపారులు దోచుకున్నారని అర్థమవుతోంది. ఇంత జరుగుతున్నా పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం ఉల్లి, టమాటా వంటి ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తోంది. మార్కెటింగ్ శాఖ ద్వారా రాయితీపై వాటిని పంపిణీ చేస్తోంది. కానీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నది ఎంత? బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నది ఎంత? అనేది మాత్రంపర్యవేక్షణ లేకుండా పోతోంది.దాని ప్రభావం ధరల పెరుగుదలపై పడుతోంది.అయితే కనీసం అనుకూల మీడియాగా పరిగణించబడుతున్న ఆంధ్రజ్యోతిలోవచ్చిన కథనంతో నైనా ప్రభుత్వం మేల్కొంటుందో?లేదో?చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper