spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Party : వైసీపీలో ముఖ్యనేతల మౌనం.. ఎందుకలా.. అసలేం జరుగుతోంది?

YCP Party : వైసీపీలో ముఖ్యనేతల మౌనం.. ఎందుకలా.. అసలేం జరుగుతోంది?

YCP Party :  అధికారంలో ఉన్న ఐదేళ్లు. నోటికి ఎంత వస్తే అంత అన్నట్లు.. నేతల వయసు, పదవి, హోదాతో సంబంధం లేకుండా ఇష్టానుసారం మాట్లాడారు వైసీపీ నేతలు. కానీ, మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. నోటి దురుసు ప్రదర్శించిన నేతలందరినీ ఏపీ ప్రజలు ఓడించారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ సైలెంట్‌ అయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు కీరోల్‌ పోషించిన నేతలంతా ఇప్పుడు నోరు మెదపడం లేదు. మరోవైపు అధిష్టానం కూడా నోటి దురుసు నేతలను పక్కన పెడుతోంది. దీంతో అంతా సైలెంట్‌ అయ్యారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లు మంత్రిగా పనిచేసిన బీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ ఇప్పుడు గప్‌చుప్‌ అయ్యారు. ఆయన తన విద్యాసంస్థల వ్యవహారాలు చూసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ, ఆయన ఎక్కడ కనిపించడం లేదు. రాజకీయాలు వ్యాపారాలకు అడ్డుగా మారతాయని, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

= వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ముత్యాలనాయుడు కూడా సైలెంట్‌ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన కూతురుకు విశాఖ రూరల్‌ టికెట్‌ ఇచ్చి.. ముత్యాలనాయుడుకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. కానీ, ఇద్దరూ ఓడిపోయారు. దీంతో ఆయన సైలెంట్‌ అయ్యారు.

= గుడివాడ అమర్నాథ్‌కు వైసీపీ అనేక అవకాశాలు ఇచ్చింది. ఆయనను అనాకాపల్లి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా, గాజువాక నుంచి ఎమ్మెల్యగా టికెట్‌ ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకు ఆయన విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు మరోమారు ఆ పదవి చేపట్టారు. కానీ యితే గుడివాడ దూకుడు అయితే గతంలో ఉన్నంతగా లేదని అంటున్నారు. ఆయన కూడా స్పీడ్‌ పెంచాల్సి ఉందని చెబుతున్నారు.

మొత్తంగా వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వారే బాధ్యత తీసుకుని జనంలోకి రాకపోతే పార్టీ క్యాడర్‌ కోసం నిలబడి ముందుకు నడిపించేది ఎవరు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినాయకత్వం ఈనెల 13 నుంచి దశలవారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో మరి ఇప్పటికైనా మాజీలు, కీలక నేతలు బయటకు వస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు మళ్లీ పుంజుకుని ఫ్యాన్‌ స్పీడ్‌ పెంచాలని అధిష్టానం భావిస్తోంది. కానీ, ఆ దూకుడు నేతల్లో కనిపించడం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Pawan Kalyan

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
Oktelugu Epaper