spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Siddam Sabha: 'గ్రాఫిక్స్'తో సిద్ధం సభలు సక్సెస్

Siddam Sabha: ‘గ్రాఫిక్స్’తో సిద్ధం సభలు సక్సెస్

Siddam Sabha: వైసీపీ సిద్ధం సభలకు లక్షలాదిమంది జనాలు వస్తున్నారా? ఒక సభకు మించి మరో సభకు జన సమీకరణ పెరుగుతోందా? నిన్నటి సిద్ధం సభకు 15 లక్షల మంది జనం వచ్చారా? అందులో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ సిద్ధం పేరిట భారీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు ప్రాంతాల్లో ఈ సభలు పూర్తయ్యాయి. తొలుత విశాఖ జిల్లా భీమిలిలో సభ జరిగింది. ప్రకాశం జిల్లా మేదరమెట్ల లో చివరి సిద్ధం సభ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.అయితే జనాలను చూపించడంలో గ్రాఫిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై టిడిపి అనుకూల మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తోంది.

సిద్ధం సభలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ కావడంతో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించింది. వేలాది ఆర్టీసీ సర్వీసులను సైతం వినియోగించుకుంది. దాదాపు 500 కిలోమీటర్ల దూరం నుంచి జనాలను తరలించినట్లు తెలుస్తోంది. సిద్ధం సభలు జరిగే సమయంలో రెండు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. మరోవైపు ఈ సిద్ధం సభలకు 600 కోట్ల రూపాయలు జగన్ సర్కార్ ఖర్చు చేసిందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అయితే ఈ విమర్శలను పక్కన పెడితే సభలకు వస్తున్న జనం విషయంలో రకరకాల అనుమానాలు వస్తున్నాయి. దీనిపైనే టిడిపి సోషల్ మీడియా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం విశేషం.

ప్రకాశం జిల్లా మేదరమెట్ల లో నిన్న సిద్ధం సభ ఏర్పాటు చేశారు. అయితే సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లోకి రావద్దని స్థానిక గ్రామస్తులు, యువకులు, ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. దీంతో సభ నిర్వహణపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. మీడియాపై సైతం పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టారు. ఒక్క సాక్షి మీడియాకు మాత్రమే అనుమతించారు. అయితే సభా ప్రాంగణంలో పూర్తిగా గ్రీన్ మ్యాట్లు పరిచారు. లైవ్ స్ట్రీమింగ్ లో కూడా చాలా తేడా కనిపిస్తోంది. దీంతో గ్రాఫిక్స్ ద్వారా జనాలు భారీగా వచ్చినట్లు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. అటు టిడిపి అనుకూల మీడియా సైతం ఇదే విషయాన్ని హైప్ చేస్తుండడం విశేషం. వి ఎఫ్ఎక్స్ ని ఉపయోగించి గ్రాఫిక్ చేశారని టిడిపి ఆరోపిస్తోంది. అటు ప్రత్యక్ష ప్రసారం సైతం 40 నిమిషాలు ఆలస్యం గా కనిపిస్తోంది. లైవ్ ఫుటేజ్ ని ప్రదర్శించడానికి విలేకరులకు అనుమతించకపోవడం కూడా అనుమానాలకు బలం చేకూరుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Oktelugu Epaper