RK Roja : విదేశాలకు రోజా.. వెస్ట్రన్ డ్రెస్ తో సోషల్ మీడియా షేక్.. పిక్ వైరల్!

వైసీపీలో రోజా ఫైర్ బ్రాండ్. దూకుడు కలిగిన నేత. అదే ఆమె అనతి కాలంలో ఎదిగేందుకు దోహదపడిన అంశం. కానీ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు ఆమె. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : August 6, 2024 5:18 pm
Follow us on

Rk Roja : ఏపీ రాజకీయాల్లో రోజా పెద్దగా కనిపించడం లేదు. వైసిపి కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. నగిరి నుంచి మూడోసారి గెలవాలనుకున్న ఆమెకు పరాజయం ఎదురయింది. పోలింగ్ నాడే తన ఓటమిని అంగీకరించారు. సొంత పార్టీ వారే తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయినా సరే ఎక్కడో గెలుపు మీద నమ్మకం ఉండడంతో కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. కానీ ఉదయం 10 గంటలకే ఓటమి అని తేలడంతో అక్కడ నుంచి నిష్క్రమించారు. అప్పటినుంచి అసలు కనిపించడమే మానేశారు. నగిరి లో ఉన్న ఇంటి నుంచి బయటకు రాలేదు.కనీసం పార్టీ శ్రేణులతో ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు.తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కూడా రోజా ఆచూకీ లేదు. మొన్న ఆ మధ్యన సీక్రెట్ గా వచ్చి జగన్ ను కలిసి వెళ్లిపోయారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో సైతం పెద్దగా కనిపించలేదు. దీంతో రోజా కేసుల భయంతో బయటకు రావడంలేదని ప్రచారం సాగింది.అయితే తమిళనాడు, కర్ణాటక లో ఆలయాల సందర్శనలో రోజా బిజీగా కనిపించారు.మొన్న ఆ మధ్యన తమిళనాడులోని ఓ ఆలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆమెతో ఫోటో తీసుకునేందుకు ముందుకు వచ్చారు. కానీ వారికి ఆమె దూరంగా ఉండిపోయారు. ఇది సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. అది మించి రోజా మీడియాలో కనిపించడం అరుదు.అయితే ఆమె తాజాగా విదేశాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ వెస్టర్న్ స్టైల్ లో వస్త్రధారణతో కనిపించడంతో.. విదేశాలకు చెక్కేశారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

* వరుసగా ఇబ్బందులు
ప్రస్తుతం రోజా పరిస్థితి బాగాలేదు.అటు గ్లామర్ రంగానికి దూరమయ్యారు. ఇటు పొలిటికల్ గాను దెబ్బతిన్నారు. సినిమా రంగం నుంచి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు రోజా. సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగారు. చట్టసభల్లో అడుగు పెట్టాలని భావించారు.కానీ ఆ పార్టీలో కోరిక తీరలేదు. అయితే వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే అయ్యారు. ఆ పై మంత్రి పదవి చేపట్టారు.అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అప్పటినుంచి అజ్ఞాతంలో గడుపుతున్నారు.

* ఆ ప్రయత్నాల్లో
తిరిగి సినీ, టీవీ రంగాల్లో అడుగు పెట్టాలని రోజా భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది.గతంలో ఆమె ఈటీవీ జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించారు. అడపాదడపా సినిమాల్లో కూడా కనిపించారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లి మంత్రి అయిన తర్వాత పూర్తిగా గ్లామర్ రంగాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు పొలిటికల్ గా ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో తిరిగి జబర్దస్త్ జడ్జిగా చేరాలని ప్రయత్నించారని తెలుస్తోంది. కానీ మల్లెమాల సమస్త నుంచి అంతగా సానుకూల రాలేదని తెలుస్తోంది.

* చెన్నైకు మకాం
రోజా చెన్నైలో ఉన్నారని ప్రచారం సాగింది. అక్కడే ఉంటూ ఓ రెండు టీవీ షో లో హోస్ట్ గా చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది. భర్త తమిళ దర్శకుడు కావడంతో అక్కడ అవకాశాల కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే ఉన్నట్టుండి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెస్ట్రన్ డ్రెస్సులు ధరించి ఉన్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రోజా కుమార్తె విదేశాల్లో చదువుకుంటుంది. ఆమెను చూసేందుకు వెళ్లి విదేశీ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం.