Renu Desai Comments : పవన్ కళ్యాణ్ తో ఆద్య సెల్ఫీ పై రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్..మాజీ భర్తపై ఇంత ప్రేమనా!

ఈ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఈ సెల్ఫీ ని రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోస్టు చేస్తూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ 'ఆద్య నా వద్దకి వచ్చి నాన్న తో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటాను అని అడిగింది

Written By: Vicky, Updated On : August 16, 2024 2:02 pm

Renu Desai's emotional comments.

Follow us on

Renu Desai Comments : పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అయ్యింది. ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయితో పెళ్లి జరిగి విడిపోయిన తర్వాత, ఆ అబ్బాయి ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఎవ్వరి అంచనాలకు అందకుండా, విడాకులు జరిగిన కొత్తల్లోనే పలు ఇంటర్వ్యూస్ లో పవన్ కళ్యాణ్ గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడేది. ఈ సార్వత్రిక ఎన్నికలలో కూడా ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, రాజకీయంగా ఆయనలాంటి నిజాయితీ పరుడుని నేను ఇంత వరకు ఎక్కడా చూడలేదు. తెలుగు ప్రజలు అదృష్టం చేసుకున్నారు, ఆయనకీ ఓటు వేసి గెలిపించండి అంటూ ఒక వీడియో కూడా చేసింది.

అంతే కాదు ఆమె అప్పుడప్పుడు పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్ ని కలుస్తూ ఉంటుంది కూడా. ఒకప్పుడు ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ని మర్చిపోలేక ఆయనకీ సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా ఆమె పవన్ గురించి మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళలో ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతూ ఉంటుంది. కానీ సోషల్ మీడియా లో అప్పుడప్పుడు కొంతమంది అభిమానులు పెట్టే కామెంట్స్ కి హర్ట్ అవుతూ ఉంటుంది రేణు దేశాయ్. అలా అనవసరంగా కామెంట్స్ చేసే వారిపైకి ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కూతురు ఆద్య పవన్ తో కలిసి కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనీయండి. ఈ సందర్భంగా ఆద్య తన తండ్రితో కలిసి సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఈ సెల్ఫీ ని రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోస్టు చేస్తూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ‘ఆద్య నా వద్దకి వచ్చి నాన్న తో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటాను అని అడిగింది. దానికి నేను ఎంతో సంతోషించాను. ఉన్నత వ్యక్తుల జీవితాలను ఆమె దగ్గరుండి చూడాలనుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. ప్రజల కోసం ఆద్య నాన్న చేస్తున్న సేవలను గుర్తించి ఎన్నో సార్లు ఆద్య గర్వపడేది’ అంటూ రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

అయితే ఇంస్టాగ్రామ్ లో ఎవరైనా పొరపాటున ఒక్క నెగటివ్ కామెంట్ పెట్టినా రేణు దేశాయ్ తీసుకోలేదు. అందుకే ఆమె ఈ పోస్ట్ కి కామెంట్స్ సెక్షన్ ని మూసేసింది. గతం లో ఒక అభిమాని ఆద్య విషయం లో తప్పుగా మాట్లాడినందుకు ఆద్యకి ఆ విషయం తెలిసి వెక్కిళ్లు పెట్టి ఏడ్చింది అంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ద్వారా తెలియచేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా కామెంట్స్ సెక్షన్ క్లోజ్ చేసి పెడుతుంది.