Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: పిఠాపురంలోకి రాయలసీమ మనుషులు.. ఏం జరుగుతోంది?

AP Elections 2024: పిఠాపురంలోకి రాయలసీమ మనుషులు.. ఏం జరుగుతోంది?

AP Elections 2024: పిఠాపురంలో పవన్ ను ఓడించాలన్న ప్రయత్నంలో వైసిపి ఉంది. ఒకవైపు రాజకీయంగా ఎదుర్కొంటూనే.. మరోవైపు వ్యవస్థల పరంగా మేనేజ్ చేస్తోంది. ఇంకోవైపు రాయలసీమ నుంచి మనుషులను దింపుతోంది. గత ఎన్నికల్లోనూ పవన్ ను ఓడించేందుకు రాయలసీమ బ్యాచ్ రంగంలోకి దిగిన సంగతి తెలిసింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఎవరెవరో పిఠాపురంలో ఎంటర్ అవుతున్నారు. మునుపెన్నడూ చూడని కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి అన్ని రకాల మాఫియాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వైసిపి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతోంది. నకిలీ మద్యం ముంచెత్తుతోంది. బయటనుంచి ఎర్రచందనం స్మగ్లర్లు, రౌడీ షీటర్లు పెద్ద ఎత్తున పిఠాపురం వస్తున్నారు. నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తున్న పిఠాపురం ప్రజలు హడలెత్తిపోతున్నారు.

రాయలసీమలోని కుప్పం, హిందూపురంలో వైసిపి ఇదే మాదిరిగా వ్యవహరిస్తోంది. ఆ రెండు నియోజకవర్గాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆధీనంలోకి తెచ్చుకొని.. ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పిఠాపురంలో సైతం పిల్ల పెద్దిరెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే ఇక్కడ వంగా గీత కేవలం అభ్యర్థి మాత్రమే. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు రాజకీయమంతా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నేతృత్వంలోని ఓ 40 మంది స్మగ్లర్లు చూస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఒక్క ఎర్రచందనం స్మగ్లర్లే కాదు అన్ని రకాల అరాచక శక్తులు పిఠాపురంలో అడుగుపెట్టాయి. అందుకే మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేకంగా స్పందించారు. ఎన్ని అరాచక శక్తులను తెచ్చుకుంటారో తెచ్చుకోండి అంటూ సవాల్ చేశారు.

పిఠాపురంలో డబ్బులతో ప్రజాభిప్రాయాన్ని మార్చాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వందల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. నియోజకవర్గంలో ప్రతి వైసిపి నేతకు రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇక మద్యం గురించి చెప్పనవసరం లేదు. పిఠాపురం మొత్తాన్ని స్మగ్లింగ్ మద్యంతో నింపేశారు. ఓటర్లకు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. కనీసం 50 చోట్ల మద్యం డంపులు పెట్టి. ప్రచారంలో పాల్గొన్న వారికి పంపిణీ చేస్తున్నారు. అయితే అదంతా నాన్ పెయిడ్ గోవా మద్యంగా తెలుస్తోంది. ఒకవైపు నోట్ల కట్టలు, మరోవైపు మద్యం, ఇంకోవైపు రాయలసీమ సంస్కృతి కనిపిస్తుండడంతో పిఠాపురం ప్రజలు భయపడుతున్నారు. ఎన్నికల్లోనే రాయలసీమ కల్చర్ చూపిస్తుంటే.. గెలిస్తే ఏ పరిస్థితి ఉంటుందో అనుమానిస్తున్నారు. అందుకే వైసీపీ తీరును తప్పుపడుతున్నారు. అయితే ఈ తరహా ప్రయోగాలు వైసిపికి నష్టమే తప్ప.. లాభం ఉండదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper