spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rammohan Naidu: టిడిపి యువ నేతకు అంతర్జాతీయ పదవి.. దూసుకుపోతున్న రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu: టిడిపి యువ నేతకు అంతర్జాతీయ పదవి.. దూసుకుపోతున్న రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu: టిడిపి యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మరో ప్రతిష్టాత్మక పదవి వరించింది. అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు లభించింది. మోడీ క్యాబినెట్లో యంగ్ డైనమిక్ మినిస్టర్ గా గుర్తింపు పొందారు ఆయన. 36 సంవత్సరాలకే ఏకంగా కేంద్ర క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఇప్పుడు ఆసియా పసిఫిక్- మినిస్ట్రీయల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఆ విభాగం అంతర్జాతీయ సమావేశంలో ఆయనను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆసియన్ పసిఫిక్ మినిస్ట్రీ రియల్ కాన్ఫరెన్స్ లో 40 దేశాలకు ప్రాతినిధ్యం ఉంది.ఆ సభ్యులు ఏకగ్రీవంగా రామ్మోహన్ నాయుడును అధ్యక్షడిగా ఎన్నుకున్నారు. ఇది దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు.26 సంవత్సరాలకే ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు.మంచి వాగ్దాటితో పాటు నడవడికతో అందరినీ ఆకట్టుకున్నారు.అదే అనతి కాలంలో ఆయనకు గుర్తింపు లభించేలా చేసింది. ఏకంగా కేంద్ర క్యాబినెట్లో విమాన యాన శాఖను దక్కించుకునేలా చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రామ్మోహన్ నాయుడుకు పదవి లభించింది. దీంతో శ్రీకాకుళం జిల్లా పులకించుకుపోతోంది. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* ఎర్రం నాయుడుది చెరగని ముద్ర
ఏపీ రాజకీయాల్లో కింజరాపు కుటుంబానిది ప్రత్యేక స్థానం. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దివంగత కింజరాపు ఎర్రం నాయుడు. 1985లో తొలిసారిగా హరిశ్చంద్ర పురం అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఎర్రం నాయుడు. 1996లో తొలిసారిగా శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1999లో కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2004 వరకు శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని పదిల పరుచుకున్నారు. 2009లో మాత్రం ఓడిపోయారు. 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

* తండ్రి అకాల మరణంతో
ఎర్రం నాయుడు అకాల మరణంతో ఆయన వారసుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు.2014లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.2019లో జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకుని నిలబడ్డారు. శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడోసారి గెలిచి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 36 సంవత్సరాలకే కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకొని పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మంచి వాగ్దాటి కలిగిన నేతగా గుర్తింపు పొందిన రామ్మోహన్ నాయుడు 2021లో సంసద్ రత్న అవార్డును సొంతం చేసుకున్నారు.

* చంద్రబాబుకు ఆత్మీయుడిగా
తండ్రి ఎర్రం నాయుడు మాదిరిగా చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడుగా మారారు.జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్టయిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో ఢిల్లీ వేదికగా లోకేష్ తో రామ్మోహన్ నాయుడు క్రియాశీలకంగా వ్యవహరించారు.కేంద్ర పెద్దలతో మాట్లాడి చంద్రబాబు బెయిల్ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు కింజరాపు కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్ర క్యాబినెట్లో ఎర్రం నాయుడు సోదరుడు అచ్చెనాయుడుకు ఛాన్స్ ఇచ్చారు.మరోవైపు రామ్మోహన్ నాయుడుకు కేంద్రం మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు.చంద్రబాబు ఆశలను వమ్ము చేయకుండా గట్టిగానే కృషి చేస్తూ వచ్చారు రామ్మోహన్ నాయుడు.ఇప్పుడు ఏకంగా ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు యువ నేత.దీంతో టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper
Exit mobile version