spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rainfall Alert in AP Districts: మరో ముప్పు.. ఏపీలో ప్రజలకు ఇది హెచ్చరిక!

Rainfall Alert in AP Districts: మరో ముప్పు.. ఏపీలో ప్రజలకు ఇది హెచ్చరిక!

Rainfall Alert in AP Districts: ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) భారీ వర్ష సూచన. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని స్పష్టం చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, భారీగా పిడుగులు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. నాలుగు రోజులపాటు పరిస్థితి ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

Also Read: Heavy rain alert Bay of Bengal : బంగాళాఖాతంలో ద్రోణి.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

తిరుమలలో భారీ వర్షం..
ప్రధానంగా తిరుమలలో( Tirumala) వాతావరణం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం భారీ వర్షం పడింది. కొండపై ఆహ్లాదకర వాతావరణంలో భక్తులు ప్రకృతిని ఆస్వాదిస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లాలో సైతం భారీ వర్షం పడింది. విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం నమోదయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రికార్డు స్థాయిలో 96.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో ఎటు చూసినా వరద నీరు కనిపించింది. భారీ వర్షాలకు చెరువులు పొంగాయి. కాలువల్లో ఉదృతంగా నీరు చేరడంతో పొంగి ప్రవహిస్తూ కనిపించాయి. కృష్ణాజిల్లాలో సైతం భారీ వర్షాలు నమోదయ్యాయి. గుడ్లవల్లేరు, తాడిచర్ల, చినగొన్నూరు, కోరాడ, విన్నకోట, కౌతవరం, వేమవరం, వడ్లమన్నాడు, దగ్గు ముల్లి లో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో కాలువల్లో భారీగా నీరు చేరి పొంగి ప్రవహించాయి.

Also Read: AP Weather : ఏపీలో చురుగ్గా రుతుపవనాలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

రుతుపవనాల ప్రభావంతో..
ఈ ఏడాది దేశానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు తాకాయి. మే 23 నాటికి కేరళ ( Kerala)తీరాన్ని తాకి త్వరగా విస్తరించాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడ్డాయి. ఏపీలో సైతం విస్తారంగా వర్షాలు కురిసాయి. మే నెలలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయింది. అయితే మధ్యలో రుతుపవనాలు మందగించాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇప్పుడు రుతుపవనాల కదలికలో మార్పు వచ్చింది. మళ్లీ వర్షాలు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ ఈదురుగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version