Homeఆంధ్రప్రదేశ్‌ABN RK Kotha Paluku: ఏబీఎన్ ఆర్కే ‘గ్యాప్’ ఇచ్చాడా? వచ్చిందా?

ABN RK Kotha Paluku: ఏబీఎన్ ఆర్కే ‘గ్యాప్’ ఇచ్చాడా? వచ్చిందా?

ABN RK Kotha Paluku: దేశంలో ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారిపోయిందని.. అధికారాన్ని దక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ ఆరోపిస్తున్నారు. బీహార్లో ఓటు అధికారి పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. వినూత్నమైన చట్టాలతో.. అమెరికా విధించిన సుంకాలను సవాలు చేస్తూ సరికొత్త దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నారు. ప్రపంచ దేశాలను చుట్టివస్తూ భారత్ సార్వభౌమాధికారాన్ని పెంపొందిస్తున్నారు.. చైనాతో మరోసారి వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!

ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణలో యూరియా కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని సంఘటనలు జరుగుతున్న క్రమంలో ఒక పాత్రికేయుడిగా వీటి వెనుక ఉన్న అసలు విషయాలను.. అసలు నిజాలను బయట పెట్టడం రాధాకృష్ణ బాధ్యత. అతడి గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. రాష్ట్రంలో, దేశంలో వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసే సత్తా రాధాకృష్ణకు మాత్రమే ఉంది కాబట్టి. పైగా ఆయన తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతో ప్రతి ఆదివారం వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేస్తుంటారు. అందులో నిజాలున్నా.. అబద్ధాలున్నా.. మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. ఎటువంటి శషభిషకు తావు లేకుండా రాస్తుంటారు. అందువల్లే వేమూరి రాధాకృష్ణకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది.

ఈ ఆదివారం కొత్త పలుకు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితం కాలేదు. ఇటీవల కూడా దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ రాధాకృష్ణ రాయకుండా సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు కూడా అదే నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు.. రాధాకృష్ణ కావాలని గ్యాప్ తీసుకున్నారా.. లేకుంటే గ్యాప్ వచ్చిందా.. తెలియదు గాని ఆయన కొత్త పలుకు రాయకపోతే మాత్రం చాలామంది హర్ట్ అవుతున్నారు. రాధాకృష్ణ ఇలా సైలెంట్ గా ఉండడం మంచిది కాదని పేర్కొంటున్నారు.. ఇటీవల కాలంలో రాధాకృష్ణ పేపర్ కార్యకలాపాలు.. ఛానల్ కార్యకలాపాలలో బిజీగా ఉంటున్నారని తెలుస్తోంది.. పేపర్ కార్యాలయానికి వెళ్లకపోయినప్పటికీ.. కీలక ఉద్యోగులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న తన పత్రిక కార్యాలయాలకు వెళ్లారు. సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. ప్రక్షాళన కూడా చేపట్టారు. పత్రికను సమున్నత స్థానంలో ఉంచడానికి తన వంతు కృషి చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version