Homeఆంధ్రప్రదేశ్‌PM Narendra Modi : ఎన్ని వరదలొచ్చినా.. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చేందుకు మోడీకి పెద్ద మనసు...

PM Narendra Modi : ఎన్ని వరదలొచ్చినా.. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చేందుకు మోడీకి పెద్ద మనసు రాదంతే?

PM Narendra Modi :  వరదల్లో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు పెద్దన్న మోడీ కి పెద్ద మనసు రాలేదు. కేంద్ర మంత్రి, అధికారుల బృందం పర్యటించినా, తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వంగివంగి దండాలు పెట్టినా పెద్దన్నలా ఆదుకుంటాడని ఆశించిన మోడీ అబ్బే అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని తేల్చేశారు. ఎన్డీయే పక్షమే అయినా ఏపీకీ నష్టంలో 15 పైసల సాయమే ఇచ్చి చేయి దులుపుకున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో తెలంగాణకి మరీ దారుణంగా బిచ్చమేసినట్లు 4 పైసల సాయం ఇచ్చి వదిలించుకున్నారు.

■ వరదలకు తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలు:
ఇటీవల వరదలకు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి. ఏపీ ప్రధాన నగరం విజయవాడ నీట మునిగి జనం అల్లాడారు. బుడమేరు, మున్నేరు, పాలేరు పొంగిప్రవహించడంతో పంటల కొట్టుకుపోతే, ఇళ్ళు మునిగి జనం చనిపోయారు. విద్యుత్ లైన్లు ,రోడ్లు తెగిపోయాయి. 40 మంది వరకు చనిపోయారు కూడా. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో వరదలు ప్రళయమే సృష్టించాయి. కాల్వ లు తెగి, పాలేరు, మున్నేరు పొంగి పంటలు కొట్టుకుపోయాయి. కాలనీలు, లోతట్టు గ్రామాలు నీటమునగడంతో వేలాదిగా నిర్వాసితులయారు.

కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకి దక్కింది అరకొరనే: కేంద్రంలోనూ బీజేపీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములవడం, రాష్ట్రంలోనూ ఎన్డీయే పేరు మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ వరద సాయంలో ఏపీని మోడీ పట్టించుకోలేదు. ఇటీవలి వరదలకు రాష్ట్రంలో రూ.6880 కోట్ల వరద నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేధిస్తే మంగళవారం విడుదల చేసిన వరద సాయం కేవలం రూ.1063 కోట్లే.. నష్టంలో 15 పైసల సాయమే కేంద్రం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నా, సీయం చంద్రబాబు మాత్రం ఏమీ అనలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు.

తెలంగాణకి వరద సాయంలో పూర్తి వివక్ష: ఎన్డీయే ప్రభుత్వమే ఉన్న ఏపీకి అరకొర సాయమే ఇచ్చిన ప్రధాని మోడీ , కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రంపై పూర్తి వివక్ష ప్రదర్శించారు. మోడీ తనకు పెద్దన్న అని ,ఎన్నికల తర్వాత రాజకీయాలుండవని, కేంద్రంతో సఖ్యంగానే వుంటామంటూ సీయం రేవంత్ రెడ్డి ఎన్ని మెట్లు దిగినా పెద్దన్న మోడీకి తెలంగాణపై కనికరం కలగలేదు. అసలు ఇవ్వకపోతే బాగుండదని కేంద్ర మంత్రి చెప్పినట్లుంది.. అందుకే నష్టంలో నలుగు పైసల సాయం ప్రకటించి ద్వారాలు మూసేసారు. రాష్ట్రంలో ఈ వరదలకు రూ.10,030 కోట్ల మేర నష్టం వాటిల్లితే కేంద్రం రూ. 416.80 కోట్ల సాయమే ప్రకటించింది. బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఆరుగురు ఎంపీలు తెలంగాణ నేతలున్నప్పటికీ వాళ్ళకి మోడీ వద్ద ఎలాంటి పలుకుబడి లేదనే విషయం ధీంతో తేలిపోయింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version