Pawanism: ట్రెండీ పిక్.. వీర మహిళలతో పవనిజం..!

Pawanism trendy pic: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా ఫుల్ జోష్ లో ఉన్నారు. రాజకీయ, సినీ రంగాలను రెండింటిని ఒకేలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళుతున్నారు. సినిమాల్లోకి ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ కు అభిమానులు అదిరిపోయే వెల్ కమ్ చెప్పారు. పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద పవన్ స్టార్ స్టామినా తగ్గలేదని నిరూపించింది. ఆ తర్వాత […]

Written By: NARESH, Updated On : July 3, 2022 2:38 pm
Follow us on

Pawanism trendy pic: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా ఫుల్ జోష్ లో ఉన్నారు. రాజకీయ, సినీ రంగాలను రెండింటిని ఒకేలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళుతున్నారు. సినిమాల్లోకి ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ కు అభిమానులు అదిరిపోయే వెల్ కమ్ చెప్పారు. పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద పవన్ స్టార్ స్టామినా తగ్గలేదని నిరూపించింది.

Pawanism

ఆ తర్వాత వచ్చిన ‘బీమ్లానాయక్’ సైతం ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన పవన్ సినిమా మాత్రం వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. దర్శకుడు క్రిష్ తో పవన్ కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. పవన్ నటిస్తున్న తొలి హిస్టరికల్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ మూవీలో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది.

పవర్ స్టార్ సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ అంతే యాక్టివ్ గా కన్పిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి వ్యతిరేక ఉద్యమం, ఏపీలో అధ్వాన రోడ్లకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం, కౌలు రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం వంటివి చేస్తున్నారు. ఈక్రమంలోనే గతంలో కంటే జనసేన పార్టీ ఏపీలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన చెప్పుకొదగిన సీట్లు సాధించి వైసీపీ, టీడీపీలకు ఝలక్ ఇచ్చింది.

జనసేన చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఏపీలోని నాలుగు జిల్లాల్లో పవన్ కల్యాణ్ కౌలు భరోసా యాత్రను ఇప్పటికే పూర్తి చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన నుంచి లక్ష రూపాయాల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. అదేవిధంగా జనవాణి పేరుతో మరో కార్యక్రమానికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జనసేనాని నేడు విజయవాడలో చేపట్టనున్నారు.

ప్రజా సమస్యలపై పవన్ పోరాటాలు చేస్తూ పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన వీర మహిళలకు రాజకీయ శిక్షణ తరగతులను ఇప్పిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలి? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి? వంటి అంశాలపై వీర మహిళలకు జనసేన శిక్షణ అందిస్తోంది.

ఈక్రమంలోనే వీర మహిళలతో పవన్ కల్యాణ్ వీర మహిళలతో ఫొటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. వీర పవన్ కల్యాణ్ వేదికపై కింద కూర్చోగా.. వెనుకలా వీర మహిళలు జై జనసేనాని అంటూ నినాదాలు చేస్తూ కన్పించారు. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ గడ్డంతో కాకుండా షేవింగ్ తో కన్పించారు. వీర మహిళలతో పవన్ కల్యాణ్ లేటేస్టుగా దిగిన ఫొటోను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోకు వీపరీతంగా లైకులు, కామెంట్స్ వస్తుండటంతో సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.