spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawankalyan : పులి మీద స్వారీ చేస్తున్న పవన్..

Pawankalyan : పులి మీద స్వారీ చేస్తున్న పవన్..

Pawankalyan : రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలకే మనం మూల్యం చెల్లించుకుంటామన్నది దాని అర్ధం. ఇప్పుడు పవన్ సైతం అలాంటి బాధితుడవుతున్నాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ అన్న నినాదం.. క్రమేపీ టీడీపీకి వరంలా మారుతోంది. అది ఎంతలా అంటే బీజేపీ పక్కన పెట్టినా.. పవన్ మాత్రం టీడీపీని బీజేపీతో సెట్ చేసే పనిలో ఉన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ మూడు పార్టీలు కలిసే వెళతాయని చెబుతున్నారు.

అయితే పవన్ విషయంలో టీడీపీ హైడ్రామా ఆడుతోంది. తనకు అవసరమనుకున్నప్పుడు ఒకలా.. అవసరం లేదన్నప్పుడు మరోలా చూపే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ విముక్త ఏపీయే తన ధ్యేయమని.. తనకు సీఎం పోస్టుతో పనిలేదన్నప్పుడు పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తోంది. అదే తనను అభిమానులు సీఎం పోస్టులో కూర్చోవాలని ఆశిస్తున్నారని.. ప్రజలు భావిస్తే తాను సీఎం తప్పకుండా అవుతానని చెప్పినప్పుడు మాత్రం పవన్ ను ఒక బలహీనమైన నాయకుడిగా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే నేతగా చూపించాలని ఆరాటపడుతుంటారు. ఈ విషయంలో ఎల్లోమీడియాతో పాటు టీడీపీ సోషల్ మీడియా చేసే అతి అంతా ఇంతా కాదు.

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి టీడీపీని పిలవకుండా జనసేనను మాత్రమే పిలవడంతో ఒక రకమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పవన్ టీడీపీని విడిచిపెట్టి ఎక్కడ వెళ్లిపోతాడని భావించి అవినీతి నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని టీడీపీ తొలుత మొదలుపెట్టింది. అవినీతి ఆరోపణ కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్టయ్యారు. పదవికి దూరమయ్యారు. ఆయనతో పాటు ఓ బినామీ వ్యాపారి ఒకర్నీ అక్కడి విచారణ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపారి ఖాతాల్లోకి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు జమ అయ్యాయన్నది ఒక ప్రచారం. అందులో ఏపీ నుంచి సైతం పెద్దఎత్తున నగదు చేరినట్టు టాక్ నడుస్తోంది. ఈశ్వరన్ కు చంద్రబాబు సన్నిహితుడు కావడం వల్ల కచ్చితంగా చంద్రబాబు పనేనంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. త్వరలో చంద్రబాబు అరెస్ట్ ఖాయమంటూ మంత్రులు సైతం ప్రకటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే సరిగ్గా ఇదే సమయంలో పవన్ ఎన్డీఏ పక్షాల సమావేశానికి హాజరవుతుండడంతో టీడీపీ కొత్త పన్నాగాన్ని పదునెక్కించింది. చంద్రబాబుతో పాటు పవన్ సైతం యాడ్ చేసింది. ఒక్క చంద్రబాబే కాదు.. ఓ హీరో భార్య ఖాతా నుంచి పెద్దఎత్తున నగదు సింగపూర్ చేరాయని.. అక్కడ సొంత వ్యాపారాల పెట్టుబడులకేనంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఇందులో పవన్ భార్యను బయటకు తీశారు. దీంతో ఆ మట్టిని పవన్ కు అంటించాలన్నది ప్లాన్. దీనిని రూపొందించింది టీడీపీ యాక్టివిస్టులు బయటకు వదిలారు. సహజంగా పవన్ పై కోపం ఉన్న వైసీపీ శ్రేణులు వాటిని ట్రోల్ చేస్తున్నాయి. సో ఇటువంటి చర్యలతో ముందుకెళుతున్న టీడీపీనే పవన్ నమ్ముతుండడం ఆందోళన కలిగిస్తోంది. అది పులి మీద స్వారీ చేయడమేనని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper